Asianet News TeluguAsianet News Telugu

కరోనా కలవరం.. ప్రపంచ వ్యాప్తంగా 50లక్షలు దాటిన కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 50లక్షలు దాటేశాయి. కాగా.. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా 3,29,294 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 4,923 మంది మరణించారు. ఇక, 20,20,157 మంది వైరస్ నుంచి కోలుకున్నారు

Coronavirus Cases Breach 5 Million-Mark Globally With Over 326,000 Fatalities
Author
Hyderabad, First Published May 21, 2020, 8:56 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అంతకంతకు దీని ఉదృతి పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లోనే లక్ష మందికి ఈ వైరస్ సోకడం గమనార్హం. తాజాగా అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం  నిన్న ఒక్క రోజే 1,01,876 మందికి కరోనా సోకింది. మొత్తంగా 50 లక్షల మందికి కరోనా సోకింది.

మొత్తంగా 50,82,661మందికి కరోనా సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. చాలా దేశాల్లో కరోనా వైరస్ ని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు. అయితే.. లాక్ డౌన్ విధించి నెలలు గడుస్తున్నా.. మార్పు ఉండకపోవడంతో విధించిన లాక్ డౌన్ ని సడలిస్తూ వస్తున్నారు. కాగా.. ఈ సడలింపులతో కరోనా కేసులు మరింత ఎక్కువగా పెరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 50లక్షలు దాటేశాయి. కాగా.. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా 3,29,294 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 4,923 మంది మరణించారు. ఇక, 20,20,157 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 

ప్రస్తుతం 27,33,210 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 45,803 మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది. దేశాల వారీగా చూస్తే అమెరికా పరిస్థితి దారుణంగానే ఉంది. అక్కడ నిన్న ఒక్క రోజే 1,461 మంది చనిపోయారు. కొత్తగా 21,408 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో మొత్తం ఇప్పటి వరకు 94,994 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఆ దేశంలో మొత్తం కేసులు 16 లక్షలకు చేరువలో ఉన్నాయి.

ఇక, మొత్తం కేసుల సంఖ్యలో భారత్ 11వ స్థానంలో, మరణాల సంఖ్యలో 13వ స్థానంలో ఉంది. ఈ మ‌హ‌మ్మారి చైనాలో పుట్టినా అతి తీవ్రంగా ప్ర‌భావితం అయింది మాత్రం అగ్ర‌రాజ్యం అమెరికానే. ఆ దేశంలో ఇప్ప‌టికే 15 ల‌క్ష‌ల 75 వేల పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఆ దేశంలో 93 వేల మంది మ‌ర‌ణించ‌గా.. 3 ల‌క్ష‌ల 61 వేల మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 11 ల‌క్ష‌ల మందికి పైగా చికిత్స పొందుతున్నారు.

ఇక ర‌ష్యాలో తొలుత వైరస్ వ్యాప్తి త‌క్కువ‌గా క‌నిపించినా.. ఆ త‌ర్వాత తీవ్రంగా వ్యాపించింది. ప్ర‌స్తుతం ర‌ష్యా క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో 3 ల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా బారిన‌ప‌డ్డారు. అయితే మ‌ర‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండ‌డం ఆ దేశ ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌నిస్తోంది. ర‌ష్యాలో ఇప్ప‌టి వ‌ర‌కు 2972 మంది మ‌ర‌ణించారు. 

మరణాల్లో అమెరికా తొలి స్థానంలో ఉండగా, యూకే (35,704), ఇటలీ (32,330) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిన్న బ్రెజిల్‌లో 911 మంది మృతి చెందారు. యూకేలో 363, మెక్సికోలో 334, ఇటలీలో 161, రష్యాలో 135, కెనడాలో 119, ఫ్రాన్స్‌లో 110, స్పెయిన్‌లో 110, పెరూలో 110 మంది మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios