Asianet News TeluguAsianet News Telugu

రెండో భార్యతో హనీమూన్ వెళ్లడానికి.. కన్నకొడుకునే అమ్మేసిన కసాయి తండ్రి.. !

కన్న పిల్లల కోసం ఆస్తులు, అవసరమైతే శరీరభాగాలు అమ్ముకున్న తల్లిదండ్రులను చూశాం. కానీ ఓ కసాయి తండ్రి మాత్రం భార్యతో హనీమూన్ వెళ్లి ఎంజాయ్ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బుతో టూర్ కు వెళ్లి ఎంజాయ్ చేశాడు. విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.

Chinese man sold son and used money to go on holiday - bsb
Author
Hyderabad, First Published May 4, 2021, 3:51 PM IST

కన్న పిల్లల కోసం ఆస్తులు, అవసరమైతే శరీరభాగాలు అమ్ముకున్న తల్లిదండ్రులను చూశాం. కానీ ఓ కసాయి తండ్రి మాత్రం భార్యతో హనీమూన్ వెళ్లి ఎంజాయ్ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బుతో టూర్ కు వెళ్లి ఎంజాయ్ చేశాడు. విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చైనా జెజియాంగ్‌ కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. ఓ పాప, రెండు సంవత్సరాల వయసున్న బాబు ఉన్నారు. అయితే దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో కోర్టు తల్లికి కూతురు బాధ్యతను, తండ్రికి కొడుకు బాధ్యతను అప్పగించింది.
 
ఉద్యోగం చేస్తున్న తండ్రికి చిన్నారి బాధ్యత చూడడం ఇబ్బందిగా మారింది. దాంతో బాబును తన తల్లిదండ్రుల దగ్గర వదిలి వచ్చాడు. కొద్దిరోజుల తర్వాత అతడు మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. కుటుంబసభ్యులు బిడ్డను తీసుకెళ్లాలని కోరారు.

కానీ రెండో భార్య అందుకు అంగీకరించలేదు. తనకు ఆ బిడ్డ ఎప్పటికైనా అడ్డంకి అని భావించిన ఆ వ్యక్తి ఓ భయంకరమైన ప్లాన్ వేశాడు. అందులో భాగంగా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి కొడుకును తీసుకువచ్చాడు. కన్నతల్లి చూడాలంటోందని.. అందుకే తీసుకెళ్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపాడు.

అది నమ్మిన కుటుంబ సభ్యులు బాబును తండ్రికి అప్పగించారు. కానీ ఆ ప్రబుద్ధుడు ఏమాత్రం జాలి, దయ లేకుండా రెండు సంవత్సరాల చిన్నారిని 1,58,000 యువాన్లు అంటే సుమారు 18 లక్షల రూపాయలకు అమ్మేశాడు. వచ్చిన మొత్తం తీసుకుని కొత్త భార్యతో హనీమూన్ కి వెళ్ళాడు. జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు. 

బాబును తల్లి దగ్గరికి తీసుకు వెళ్లి వారం రోజుల పైనే అవుతుండడంతో, ఇంకా తిరిగి రాకపోవడంతో బాబు తండ్రికి కాల్ చేశారు అతని కుటుంబ సభ్యులు. అతని ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దాంతో కన్న తల్లికి ఫోన్ చేసి బిడ్డ గురించి అడిగారు. ఆమె తన దగ్గరికి తీసుకు రాలేదని తెలిసింది. దాంతో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు అతని పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని గురించి దర్యాప్తు చేయగా, సదరు వ్యక్తి బాబును అమ్మకానికి పెట్టి, వచ్చిన డబ్బుతో కొత్త భార్యను తీసుకుని హనీమూన్కు వెళ్లినట్లు తెలిసింది. దంపతులు వచ్చే వరకు ఎదురు చూసిన పోలీసులు, ఆ తర్వాత వారిని అరెస్టు చేసి, జైలుకు పంపారు.

కాగా చైనాలో ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. నిరుడు ఓ వలస కూలి అప్పుడే పుట్టిన బిడ్డను 17.74 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. మరో 19 ఏళ్ల కుర్రాడు ఐఫోన్ కోసం నవజాతశిశువును అమ్మేశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios