Asianet News TeluguAsianet News Telugu

ప్రార్థనా స్థలంలో ఆత్మాహుతి దాడి, 20 మంది మృతి

అప్ఘానిస్థాన్ లో తాలిబన్లు మరోసారి రక్తపాతాన్ని సృష్టించారు. ఓ ప్రార్థనా మందిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడి 20 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ బాంబు పేలుళ్లలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషయమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అప్ఘాన్ అధికారులు వెల్లడించారు. 

bomb blast on afghanistan

అప్ఘానిస్థాన్ లో తాలిబన్లు మరోసారి రక్తపాతాన్ని సృష్టించారు. ఓ ప్రార్థనా మందిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడి 20 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ బాంబు పేలుళ్లలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషయమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అప్ఘాన్ అధికారులు వెల్లడించారు. 

అప్ఘాన్ లోని పక్టియా ప్రావిన్స్ లోని గార్డేజ్ సిటీలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇవాళ శుక్రవారం కావడంతో ప్రార్థనలు చేయడానికి మసీదులకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు. దీంతో వీరిని టార్గెట్ గా చేసుకుని ఈ దాడి జరిగింది. అందరు ప్రార్థనలు చేస్తుండగా హటాత్తుగా వారి మధ్యలోకి వెళ్లిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుళ్లలో ఇప్పటివరకు 20 మంది చనిపోయినట్లు సమాచారం. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రస్తుతం సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దాడిలో గాయపడిన క్షతగాత్రుల్లో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అప్ఘాన్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ దాడికి పాల్పడినట్లు ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios