బాబా వంగా 2043లో యూరప్‌లో ముస్లిం పాలన, 2076లో కమ్యూనిజం తిరిగి రానుందని, 5079లో భూమి అంతం అవుతుందని అంచనా వేశారు.

 

భవిష్యవాణుల గురించి మాట్లాడుకుంటే, బాబా వంగా పేరు తప్పక వినిపిస్తుంది. అతను కళ్లు లేకుండా జీవించినప్పటికీ, భవిష్యత్తు గురించి చేసిన అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తాజాగా ఆమె చెప్పిన కొన్ని అంచనాలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బల్గేరియాకు చెందిన బాబా వంగా, ఆయన జీవితంలో ఎన్నో భవిష్యవాణులు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం, సోవియట్ యూనియన్ పతనం, స్టాలిన్ మరణం, చెర్నాబిల్ విపత్తు, 9/11 దాడి వంటి అనేక సంఘటనలను ముందుగానే చెప్పిందని అనేకమంది నమ్ముతారు. అంతేకాకుండా, 2004 సునామీ, 1985లో ఉత్తర బల్గేరియాలో సంభవించిన భూకంపాన్ని కూడా ఆమె అంచనా వేసినట్టు చెబుతున్నారు.

ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోన్న విషయాల్లో ముఖ్యమైనది ఆయన 2043 అంచనా. అప్పటికి యూరప్‌లో ముస్లిం పాలన ఏర్పడుతుందని, 44 దేశాలు ముస్లింల ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉందని ఆమె చెప్పినట్టు చెబుతున్నారు. అంతేకాకుండా, 2076 నాటికి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పాలన తిరిగి రానుందని, 5079లో భూమి ఒక సహజ కారణం వల్ల పూర్తిగా నశించబోతుందని ఆమె అంచనా వేసినట్టు సమాచారం.ఇవే కాకుండా, జపాన్‌కు చెందిన జాతకుడు రియో టాట్సుకి కూడా 2025లో భారీ సునామీ సంభవించబోతుందని చెబుతున్నాడు. జులైలో వచ్చే ఈ సునామీ జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, తైవాన్ లాంటి దేశాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చని, ఇది 2011లో వచ్చిన జపాన్ సునామీ కంటే మూడింతల బలంగా ఉండే అవకాశం ఉందని మీడియా నివేదికలు వెల్లడించాయి.

ఇలాంటి అంచనాలు నిజమవుతాయా కాదా అనేది కాలమే చెబుతుంది. అయితే, భవిష్యవాణులపై ప్రజల ఆసక్తి, విశ్వాసం మాత్రం ఏ మాత్రమె తగ్గడం లేదు. నోస్ట్రాడమస్, బాబా వంగా లాంటి వ్యక్తుల అంచనాలు ఇప్పటికీ అనేకమందిని ఆకట్టుకుంటున్నాయి.