MEA on China:చైనా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దేశ సరిహద్దులో రోజురోజుకో కుట్ర వెలుగులోకి వస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని విదేశాంగ శాఖ గా ఖండించింది. ప్యాంగాంగ్ సరస్సుకు ఆవల చైనా వంతెన నిర్మించడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఆ ప్రాంతం 60 ఏళ్లుగా చైనా దురాక్రమణలోనే ఉందని తెలిపింది.
MEA on China: డ్రాగన్ దేశం చైనా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దేశ సరిహద్దులో రోజురోజుకో కుట్ర వెలుగులోకి వస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్యాంగాంగ్ సరస్సు పరిసర ప్రాంతాల్లో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ప్యాంగాంగ్ సరస్సులో చైనా భూభాగం(1950లో చైనా ఆక్రమించుకున్న ప్రాంతం) ఖురాంక్ ప్రాంతంలో ఓ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి.
ప్యాంగాంగ్ సరస్సులో చైనా ఆక్రమిత ఖురాంక్ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణ పనులు సాగిస్తోంది చైనా. ఖురాంక్ నుంచి సరస్సు దక్షిణ సరిహద్దుకు చేరుకునేందుకు ఈ నిర్మాణం ఉపయోగపడుతుంది. ఈ నిర్మాణం పూర్తయితే చైనా దళాలు 180 కిలోమీటర్లు చుట్టు తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. ఖురాంక్ నుంచి రుడాంక్కు దాదాపు 50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ దూరం 200 కిలోమీటర్లకు పైగా ఉంటుంది.
ఈ అక్రమ నిర్మాణంపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. పాంగోంగ్ సరస్సుపై చైనా కొత్త వంతెన నిర్మాణాన్ని చేపడుతోందని తెలిపింది. చైనా తన భద్రతా ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దాదాపు 60 ఏళ్ల కిత్రం భారత్ నుంచి అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల్లో చైనా వంతెనను నిర్మిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం తెలిసినట్టు ప్రకటించారు. భారత్ కూడా భద్రతా ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటోందని MEA అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భగామేనని చైనాకు గుర్తుచేశాడు. పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెనకు సంబంధించిన నివేదికలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. దాదాపు 60 ఏళ్లుగా చైనా దురాక్రమణలో ఉన్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. భారత్ ఈ నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోందనీ, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందనీ, భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని ఆ విషయాన్ని చైనా గమనించాలని అరిందమ్ బాగ్చి హెచ్చరించారు.
అటు, ప్రవాస టిబెటన్ పార్లమెంటు విందుకు హాజరైన భారత ఎంపీలకు చైనా రాయబార కార్యాలయం లేఖ రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. భారత ఎంపీల సాధారణ కార్యకలాపాలను చైనా హైప్ చేయడం మానుకోవాలని , మన ద్వైపాక్షిక సంబంధాలలో పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, భారత్ కూడా గత ఏడేళ్లలో సరిహద్దులో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేసిందని, బడ్జెట్లో కూడా గణనీయంగా కేటాయింపు చేస్తుందని తెలిపారు. స్థానికులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. సైనిక అవసరాలకూ ఇవి పయోగపడుతున్నాయన్నారు.