మానసికవ్యాధితో బాధపడుతున్న ఓ యువతి డాక్టర్‌ను సంప్రదించంది. డాక్టర్‌తో మాట్లాడుతున్న సమయంలో ఎమోషనల్ అయిపోయింది. ఏడ్చేసింది. ఇలా ఏడ్చినందుకు ఆ హాస్పిటల్ సుమారు రూ. 3100 వసూలు చేసింది. ఆమె సోదరి ఆ హాస్పిటల్ బిల్లు రశీదును ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఆ పోస్టు వైరల్ అవుతున్నది. 

న్యూఢిల్లీ: ఆమె మానసికంగా కొంత కుంగుబాటు అనుభవిస్తున్నది. సరైన కేరింగ్ అందక తరుచూ ఎమోషనల్ అవుతుంది. డిప్రెషన్‌లోకి వెళ్లి ఏడ్చేస్తుంది. తన మానసిక అనారోగ్యానికి చికిత్స తీసుకోవడానికి హాస్పిటల్ వెళ్లింది. వైద్యుడి కన్సల్టేషన్ కోసం ఎదురుచూసింది. ఆ తర్వాత తన అనారోగ్యం గురించి వైద్యుడితో చెప్పడానికి వెళ్లింది. ఈ కన్సల్టేషన్ సమయంలో ఆమె కొంత ఎమోషనల్ అయింది. ఏడ్చేసింది. తీరా బయటకు వచ్చి చూస్తే.. తన ఏడుపు గురించి వైద్యుడు అడగనే లేదు. కానీ, ఏడ్చినందుకు 40 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 3100)లు బిల్లులో పొందుపరిచారు. ఈ బిల్లు చూసి ఆమె ఖంగుతింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

ఈ బిల్లు రశీదును ఆమె సోదరి, ప్రముఖ యూట్యూబర్ కెమిలీ జాన్సన్ తన ట్విట్టర్ అకౌంట్‌తో పోస్టు చేశారు. ట్విట్టర్‌లో ఈ మేరకు ఓ త్రెడ్ రాసుకొచ్చింది. తన సోదరి ఓ అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని వివరించింది. ఆ బిల్లు ప్రకారం కెమిలీ జాన్సన్ సోదరి జనవరిలో వైద్యుడిని సంప్రదించింది. అందులో అనేక పరీక్షలతోపాటు ఏడ్చినందుకు కూడా బిల్లు వేసినట్టు కనిపించింది. అయితే, ఆ ఏడుపును సమీక్షించినట్టు తర్వాత వాదనలు వచ్చాయి. కానీ, తన సోదరిని ఏడ్చినందుకు కనీసం ఆరా కూడా తీయలేదని తిప్పికొట్టింది.

Scroll to load tweet…

ఒక్క కన్నీటి చుక్కకు 40 డాలర్లు వసూలు చేశారని, కనీసం ఎందుకు ఏడ్చారని, ఏడుపు వెనుక కారణాలైనా వారు అడగలేదని పేర్కొంది. ఆ బిహేవియర్‌ను కూడా పరీక్షించలేదని వివరించింది. అందుకు సంబంధించి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ కూడా ఇవ్వలేదని తెలిపింది.

స్కూల్ గర్ల్స్ భీకరంగా దాడి చేసుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. కర్ణాటక రాజధాని బెంగుళూరులో సెయింట్ మార్క్స్ రోడ్డుపై.. ఓ స్కూల్ భవనానికి అపోజిట్‌లో బాలికలు రెండు గ్యాంగ్‌లు వచ్చి చేరారు. కొందరు స్కూల్ యూనిఫామ్‌లో ఉండగా, ఇంకొందరు క్యాజువల్ డ్రెస్‌లలో ఉన్నారు. ఆ రెండు గ్యాంగ్‌లు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ దాడి చేసుకున్నారు. ఆ రోడ్డు పక్కన కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయి. ఆ కార్ల పక్కనే పేవ్‌మెంట్‌పై స్ట్రీట్ ఫైట్ మొదలైంది. కొందరు అందులో జుట్టు పట్టుకుని లాగారు. ఇంకొందరు నెట్టేసి కింద పడేశారు. మరికొందరు కర్రలతో దాడి చేశారు. పెద్దగా అరుపులు వినరావడంతో స్థానికులు అక్కడికి పరుగున చేరారు. కానీ, ఆ స్కూల్ గర్ల్స్ మాత్రం దాడి చేయకుండా ఆగలేదు. దీంతో స్థానికులు కలుగజేసుకోవాల్సి వచ్చింది. కొందరు వారిని హెచ్చరించి అక్కడి నుంచి హడలగొట్టి పంపించేశారు. ఈ దాడి తర్వాత చాలా మంది పిల్లలు గాయపడ్డట్టు తెలిసింది. ఈ ఘటన మొత్తం ఒకరు రికార్డ్ చేశారు. కేవలం 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.