Asianet News TeluguAsianet News Telugu

ఉగ్రవాదుల శిబిరాలనుకుని అమెరికా వాయుదళాల కాల్పులు: 17 మంది పోలీసులు దుర్మరణం

అమెరికా వాయు దళాల పొరపాటు 17 మంది పోలీసులను బలితీసుకుంది. ఉగ్రవాదుల శిబిరాలనుకుని ఆఫ్గన్ పోలీసుల శిబిరాలపై కాల్పులు  జరిపారు. ఈ ఘటనలో ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన 17 మంది పోలీసులు మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 

American Air Force fired on police bases, where terrorists' camps are
Author
Kabul, First Published May 18, 2019, 8:55 PM IST

కాబుల్: అమెరికా వాయు దళాల పొరపాటు 17 మంది పోలీసులను బలితీసుకుంది. ఉగ్రవాదుల శిబిరాలనుకుని ఆఫ్గన్ పోలీసుల శిబిరాలపై కాల్పులు  జరిపారు. ఈ ఘటనలో ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన 17 మంది పోలీసులు మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

శుక్రవారం రాత్రి ఆఫ్గనిస్థాన్ రక్షణ దళాలకు తాలిబన్ లకు మధ్య భీకర పోరు జరిగింది. అయితే ఈ ఆఫ్ఘన్ రక్షణ దళాలకు మద్దతుగా అమెరికాకు చెందిన సైనికులు తాలిబన్లపై యుద్ధానికి దిగారు. అయితే ఉగ్రవాదుల క్యాంపులపై కాల్పులు జరపాల్సి ఉండగా, ఆఫ్గన్ రక్షణ దళ క్యాంపులపై మెరుపు దాడులు జరిపారు. 

ఈ కాల్పుల్లో 17 మంది మరణించడం జరిగింది. అమెరికా వాయు దళాలు చేసిన దాడుల్లో 35 మంది ఆఫ్గన్ పోలీసులు మరణించినట్లు తాలిబన్‌కు చెందిన క్వారి యూసఫ్ అహ్మదీ తెలిపారు. అయితే ఈ విషయమై మరింత విచారణ జరిపిన తర్వాత పూర్తి వివరాలు బయటపెడతామని ఒమర్ జ్వాక్ అనే అధికారి స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios