Al Jazeera journalist: ఇజ్రాయిల్ దళాలు జరిపిన దాడిలో మహిళా రిపోర్టర్ షిరీన్ అబూ అలేహ్ మృతి చెందింది. పాలస్తీనా భూభాగంలో పనిచేస్తున్న తమ రిపోర్టర్ షిరీన్ను ఇజ్రాయిల్ దళాలు హతమార్చినట్లు అల్ జజీరా సంస్థ పేర్కొంది.
Al Jazeera journalist: ఇజ్రాయిల్ దళాలు జరిపిన దాడిలో మహిళా జర్నలిస్ట్ మృతి చెందింది. రిపోర్టు చేస్తున్న సమయంలో ఆమెపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్టు అల్ జజీరా సంస్థ పేర్కొంది. వివరాల్లోకెళ్తే.. పాలస్తీనా భూభాగంలో పనిచేస్తున్న అల్-జజీరా జర్నలిస్ట్ షిరిన్ అబు అలేహ్ బుధవారం తెల్లవారుజామున వెస్ట్ బ్యాంక్లో కాల్చి చంపబడ్డారు.
ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో బుధవారం ఆపరేషన్ చేపట్టిన సమయంలో అక్కడి పరిస్థితి అదుపు తప్పిందని ఇజ్రాయిల్ తెలిపింది. దీంతో అనుమానితులు,భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయని, ఈ క్రమంలో అక్కడ రిపోర్టింగ్ చేస్తున్న అల్-జజీరా జర్నలిస్ట్ షిరిన్ అబు అలేహ్ తలలోకి బులెట్లు దూసుకవెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు అల్-జజీరా తెలిపింది. అల్-జజీరా తన జర్నలిస్ట్ మరణానికి ఇజ్రాయెల్ దళాల తప్పిదంగా నిందించింది. ఇజ్రాయిల్ దళాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఈ దారుణానికి పాల్పడిందని తెలిపింది. ఈ దాడి కావాలనే జరిగిందని ఈ అంశంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని అల్ జజీరా కోరింది.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ స్పందించింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యైర్ లాపిడ్ మాట్లాడుతూ పాలస్తీనా అథారిటీకి రిపోర్టర్ మరణంపై సంయుక్త దర్యాప్తును ప్రతిపాదించినట్లు చెప్పారు. సంఘర్షణ ప్రాంతాలలో జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ఆయన ట్వీట్ చేశారు. నిజానిజాలు తెలుసుకోవడం మనందరి బాధ్యత.
పాలస్తీనా అథారిటీ ఈ దాడిని ఖండించింది మరియు ఇజ్రాయెల్ దళాలు చేసిన "షాకింగ్ నేరం" అని పేర్కొంది. పాలస్తీనా అథారిటీ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని కొన్ని భాగాలను నియంత్రిస్తుంది. భద్రతా విషయాలలో ఇజ్రాయెల్తో సహకరిస్తుంది. జెరూసలెంలో జన్మించిన అబూ అక్లేహ్ వయస్సు 51 సంవత్సరాలు. ఆమె 1997లో అల్-జజీరా కోసం పని చేయడం ప్రారంభించింది మరియు పాలస్తీనా భూభాగాల నుండి క్రమం తప్పకుండా రిపోర్టింగ్ చేస్తోంది.