Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్: తాలిబన్ల చెరలో వున్న భారతీయులు క్షేమం.. ఇండియా తరలింపుకు ఏర్పాట్లు..?

కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దాదాపు 150 మంది భారతీయులను బందీలుగా చేసుకున్నారు తాలిబన్లు. వీరంతా ప్రస్తుతం క్షేమంగానే వున్నట్లుగా తెలుస్తోంది. మరికొద్దిగంటల్లో ప్రత్యేక విమానం ద్వారా వీరందరినీ భారత్‌కు తరలించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది

Afghanistan Indians detained on way to Kabul airport released subsequently
Author
Kabul, First Published Aug 21, 2021, 3:29 PM IST

ఆఫ్ఘాన్‌లో తాలిబన్ల చెరలో వున్న భారతీయులు క్షేమంగా వున్నారు. వారిని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విదేశాంగ శాఖ అధికారులు. అటు అమెరికాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో ఏ క్షణంలోనైనా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానంలో వారిని తరలించే అవకాశం వుంది. 

Also Read:తాలిబాన్ల చెరలో 150 మంది.. బందీల్లో ఎక్కువ మంది భారతీయులే

కాగా, కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దాదాపు 150 మంది భారతీయులను బందీలుగా చేసుకున్నారు తాలిబన్లు. విమానాశ్రయం నుంచి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ట్రక్కుల్లో తరలించారు. ప్రయాణ పత్రాలు, గుర్తింపు  కార్డులు పరిశీలించారు. ఆఫ్ఘన్‌లో ఇంకా 1000 మందికి పైగా భారతీయులు వున్నట్లు సమాచారం. చాలా మంది భారత దౌత్య కార్యాలయం వద్ద తమ పేర్లను నమోదు చేసుకోలేదు.

భారతీయులను సురక్షితంగా చూసుకుంటామని తాలిబాన్లు ఇది వరకే ప్రకటించారు. భారత దౌత్యాధికారులకూ ఎలాంటి హాని తలపెట్టబోమని వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ, తర్వాతి రోజే కాందహార్, హెరాత్‌లోని భారత కాన్సులేట్‌లలో సోదాలు చేసి అక్కడ పార్క్ చేసిన బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్స్‌ను ఎత్తుకెళ్లిన ఘటన ఆందోళన కలిగించింది. తాలిబాన్ నాయకత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న చేతలకు పొంతన లేదని స్పష్టమైంది. తాజాగా, ఈ ఉదంతం ఆ వాదనను ధ్రువీకరించినట్టయింది.

Follow Us:
Download App:
  • android
  • ios