Afghanistan : కాబూల్ ఎయిర్ పోర్టులో కాల్పులు... ఐదుగురు మృతి...
భారత్, అమెరికా సహా పలు దేశాలు తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి. దీంతో కాబూల్ ఎయిర్ పోర్ట్ కిక్కిరిసి పోయింది.
తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ నుంచి బయటపడేందుకు వేలాది మంది ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి జనం పోటెత్తడంతో భారీ ఫైరింగ్ జరిగింది. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. వీరిని నియంత్రించేందుకు అంతకుముందు యుఎస్ దళాలు కూడా గాలిలోకి కాల్పులు జరిపినట్టు నివేదికలు వెలువడ్డాయి.
భారత్, అమెరికా సహా పలు దేశాలు తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి. దీంతో కాబూల్ ఎయిర్ పోర్ట్ కిక్కిరిసి పోయింది. అయితే ప్రస్తుతం ఆ దేశ గగనతలాన్ని మూసివేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో కాబూల్ కు విమానాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది.
ఆఫ్గాన్ గగనతలాన్ని మూసివేసినట్లు విమానయాన సంస్థలకు నోటీసు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడికి విమానాలను పంపలేకపోతున్నామని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. అఫ్గానిస్థాన్ గగనతలాన్ని అన్ని ఎయిర్ లైన్లకు మూసివేసినట్లు తెలిసింది. అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చే మా విమనాలను ఆఫ్గాన్ మీదుగా వెళ్లకుండా దారి మళ్లిస్తున్నాం.
ఆ విమానాలన్నీ దోహా యూఏఈలో ఇంధనం నింపుకొని ఢిల్లీకి వస్తాయి. ఇక, ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు కాబూల్ కు విమానాన్ని పంపాలని అనుకున్నాం. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు’ అని ఎయిర్ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. చికాగో నుంచి ఢిల్లీ వస్తోన్న విమానాన్ని గల్ఫ్ మీదుగా దారి మళ్లించారు.
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను హస్తగతం చేసుకోవడంతో మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. స్పీకర్, మంత్రులు ఇప్పటికే పాకిస్తాన్కు పారిపోయారు. తాలిబన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
కాగా, తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను హస్తగతం చేసుకోవడంతో మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. తాలిబన్లకు అధికారం అప్పగించిన అనంతరం ఆఫ్ఘనిస్తాన్ నుంచి అష్రఫ్ ఘనీ నిష్క్రమించారు. కాగా, కాబూల్లో ఆదివారం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నేటి ఉదయం తాలిబన్లు నగర శివార్లలోకి, అక్కడి నుంచి నగరంలోకి ప్రవేశించారు.
దీంతో అఫ్గాన్ రాజధాని వారి గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అనంతరం శాంతియుతంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం దేశ అధ్యక్షుడి ప్యాలెస్కు చేరుకున్నారు. దేశ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అబ్దుల్ సత్తార్ మిర్జక్వాల్ మాట్లాడుతూ అధికార బదలాయింపు శాంతియుతంగా జరుగుతుందని తెలిపారు. మరోపక్క తాలిబన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పాలన పగ్గాలను స్వచ్ఛందంగా అప్పజెప్పారు.
అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేయగా.. స్పీకర్, మంత్రులు ఇప్పటికే పాకిస్తాన్కు పారిపోయారు. మరోవైపు ఆ దేశంలో సుమారు 1500 మంది భారత పౌరులు వున్నట్లుగా తెలుస్తోంది. వీరందరినీ తిరిగి స్వదేశానికి రావాల్సిందిగా అడ్వైజరీనీ జారీ చేసింది భారత విదేశాంగ శాఖ. అటు తాలిబన్ల ఎంట్రీతో అమెరికా రాయబార కార్యాలయం ఖాళీ అవుతోంది. ఆ దేశ దౌత్య సిబ్బందితో పాటు సైనిక సిబ్బందిని హెలికాఫ్టర్లలో తరలిస్తోంది. మరోవైపు కీలకమైన సమాచారాన్ని ధ్వంసం చేసింది అమెరికా.