కాబూల్ లో ఆత్మాహుతి దాడి... నలుగురు మృతి
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. శుక్రవారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. శుక్రవారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ అంతర్జాతీయ సంస్థకు చెందిన వాహనాల కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడిలో నలుగురు ఆఫ్ఘన్లు మరణించగా, మరో నలుగురు అమెరికాసైనికులు గాయపడ్డారు.
కాబూల్ నగరంలోని ఖాలా ఏ వజీర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, గురువారం మిలటరీ ట్రైయినింగ్ అకాడమీ బయట ఐసిస్ తీవ్రవవాదులు జరిపిన బాంబు దాడిలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే.