Asianet News TeluguAsianet News Telugu

అఫ్ఘానిస్థాన్‌ : తాలిబన్లపై పంజా విసురుతున్న పంజ్ షిర్...! తిరుగుబాటుతో ఊహించని షాక్ ! 300మంది హతం..!!

తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్ఘనిస్థాన్ లోని సామాన్యులు కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పంజ్ షిర్ కేంద్రంగా ఉన్న నార్తన్ అలయన్స్, అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్... ఇటీవలే తాలిబన్ల పాలన అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. 

Afghanistan : 300 Taliban fighters killed in Panjshir valley
Author
Hyderabad, First Published Aug 23, 2021, 3:12 PM IST

కాబూల్ : అఫ్గనిస్తాన్ తమ వశమైపోయిందని సంబరపడిపోతున్న తాలిబన్లకు ఊహించన్ షాక్ తలిగింది. వారిమీద తిరుగుబాటులో భాగంగా జరిగిన దాడుల్లో ఏకంగా 300మంది తాలిబన్లు హతమైనట్లు తెలుస్తోంది. అఫ్గనిస్థాన్ లో ఇప్పటికీ తాలిబన్ల ఆధీనంలోకి రాని ఒకే ఒక ప్రాంతం పంజ్ షిర్. దీంతో వారు తాజాగా ఆ ప్రాంతంమీద దృష్టి పెట్టారని తెలుస్తోంది. 

తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్ఘనిస్థాన్ లోని సామాన్యులు కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పంజ్ షిర్ కేంద్రంగా ఉన్న నార్తన్ అలయన్స్, అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్... ఇటీవలే తాలిబన్ల పాలన అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. వీరికి సాధారణ పౌరుల మద్దతు కూడా క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పంజ్ షిర్, కపిసా ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఏకంగా 300మంది తాలిబన్లు హతమైనట్లు సమాచారం. 

పంజ్ షిర్ అంటే... అయిదు సింహాలు ఉన్న ప్రాంతం అని అర్థం. రాజధాని కాబూల్ కు ఉత్తరాన సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. పంజ్ షిర్ చుట్టూ కోట గోడల్లా ఉన్న హిందూకుష్ పర్వతాలు, అడవుల కారణంగా తాలిబన్లకు ఈ ప్రాంతాన్ని వశం చేసుకోవడం ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. ఇక్కడి జనాభా దాదాపు లక్షన్నర..! 

వీరందరూ తజిక్ జాతికి చెందినవారే. ఇక్కడి ప్రజలకు పోరాట పటిమ చాలా ఎక్కువని పరిశీలకులు అంటుంటారు. 1996లో తొలిసారిగా ఆఫ్ఘాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు ..పంజ్ షిర్ ను మాత్రం తమ వశం చేసుకోలేకపోయారు. 1990ల్లో తాలిబన్లకు సింహస్వప్నంగా నిలిచిన వ్యక్తి అహ్మద్ షా మసూద్. తాలిబన్ల మీద తిరుగుబాటుకు అప్పట్లో ఆయనే నాయక్తవం వహించారు. అక్కడి భౌగోళిక లక్షణాల ఆసరాగా గెరిల్లా యుద్ధం చేస్తూ అహ్మద్ షా మసూద్ తాలిబన్లకు వణుకు పుట్టించారు. 

2001లో తాలిబన్లు దొంగచాటుగా దెబ్బ కొట్టడంతో ఆయన మరణించారు. ఇంటర్వ్యూ కోసం జర్నలిస్టుల రూపంలో వచ్చిన ముష్కరులు అహ్మద్ మీద అకస్మాత్తుగా దాచి చేసి హత్య చేశారు. ప్రస్తుతం పంజ్‌షిర్ వాసులు మరోసారి తాలిబన్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. 

ఒకప్పుడు తాలిబన్లకు సింహస్వప్నంగా నిలిచిన అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్.. ప్రస్తుతం తాలిబన్ల వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారు. తమకు కావాల్సిన ఆయుధాలను సరఫరా చేస్తే తాలిబన్ల  ఆటకట్టిస్తామని ఆయన ఇటీవలే శపథం చేశారు. ఇక ఆఫ్ఘాన్ మాజా ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్ కూడా తాలిబన్ల కథ ముగిస్తామని బహిరంగ ప్రకటన చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ తాలిబన్లను ఎదుర్కొనేందుకు పంజ్ షిర్ వేదికగా వ్యూహాలు రచిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios