అమెరికాలోని గురువారం నాడు రాత్రి ఓ దుండగుడి కాల్పుల్లో 8 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. కాల్పుల తర్వాత దుండగుడు కూడ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వాషింగ్టన్: అమెరికాలోని గురువారం నాడు రాత్రి ఓ దుండగుడి కాల్పుల్లో 8 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. కాల్పుల తర్వాత దుండగుడు కూడ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం నాడు రాత్రి ఇండియానాపోలీస్ ఎయిర్పోర్ట్కు సమీపంలోని ఫెడ్ఎక్స్ ఫెసిలిటీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.
ఇండియానా పోలీస్ మెట్రోపాలిటిన్ పోలీస్ శాఖ ఈ విషయాన్ని మీడియాకు వివరించింది. గురువారం నాగు రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.ఇండియానాపోలీస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలోనే ఈ కాల్పుల ఘటన చోటు చేసుకొంది.
గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్చినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటన వివరాలను పోలీస్ శాఖ అధికార ప్రతినిధి జెనే కుక్ మీడియాకు వివరించారు.ఆటోమెటిక్ మెషిన్ గన్ ను చేతిలో పట్టుకొన్న వ్యక్తి బహిరంగంగా కాల్పులు జరుపుతుండడం చూసినట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
నిందిుతుడు ఎందుకు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
