కొలంబియాలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. 

బొగోటా : కొలంబియా రాజధాని బొగోటాలో గురువారం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంప కారణంగా సైరన్‌లు మోగడంతో కొద్దిసేపు భయాందోళనలకు దారితీసింది. ఒక మహిళ భవనంపై నుండి దూకి మరణించినట్లు అధికారులు తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పెద్ద నష్టం ఏదీ నివేదించబడలేదు, కానీ మేయర్ ప్రకారం "ఎలివేటర్లు, ఇతర చిన్న సంఘటనలలో చిక్కుకున్న వ్యక్తుల ఘటనలు" ఉన్నాయి. కొలంబియన్ జియోలాజికల్ సర్వే (సిజిఎస్) భూకంప తీవ్రతను 6.1 గా పేర్కొనగా, యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) 6.3 గా నివేదించింది.

Plane Crash: ఎక్స్‌ప్రెస్‌వేపై కుప్ప‌కూలిన‌ విమానం.. 10 మంది మృతి

భూకంపం మధ్యాహ్నం 12:04 గంటలకు (1704 GMT) సంభవించిందని కొలంబియన్ ఏజెన్సీ తెలిపింది, బొగోటాకు ఆగ్నేయంగా 40 కిలోమీటర్లు (25 మైళ్లు) దూరంలో ఉన్న ఎల్ కాల్వరియో పట్టణంలో దాని కేంద్రం ఉంది. దీని తర్వాత 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఏజెన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

భూకంపం కారణంగా భవనాలు కంపించాయి. దీంతో భవనాల్లోని సైరన్‌లు మోగాయి. దీంతో భయాందోళనకు గురైన వేలాది మంది నివాసితులు రాజధాని వీధుల్లోకి పరుగెత్తారు. తమవారు ఎలా ఉన్నారోనని కనుక్కునే ప్రయత్నం చేశారు. 

"భయాందోళనలతో ఒక మహిళ తాను నివసిస్తున్న బిల్డింగ్ 10వ అంతస్తు నుండి దూకిన విషాద ఘటన తప్ప వేరే ఘటనలు నమోదు కాలేదు. మహిళ మృతి చెందినట్లు అగ్నిమాపక సిబ్బంది నిర్ధారించారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న విల్లావిసెన్సియో, బుకారమంగా, తుంజా, ఇబాగ్ నగరాల్లో భూకంపం సంభవించినట్లు నెటిజన్లు కామెంట్స్ చేశారు. 

"బొగోటాలో బలమైన ప్రకంపనలు వస్తున్నాయి. కంగారు పడొద్దు. ప్రశాంతంగా, జాగ్రత్తగా ఉందాం. దయచేసి ఈ భూ ప్రకంపనల నుండి ప్రమాదం బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుందాం" అని అధికారులు తెలిపారు. 

సెంట్రల్ కొలంబియా భూకంపాలకు చురుకైనది. దేశంలోని ప్రధాన భౌగోళిక లోపాలలో ఒకటి. 2008లో ఎల్ కాల్వరియోలో 5.5 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 11 మంది మరణించారు.