తాజాగా, ఫ్రాన్స్ లో వైరస్ నాలుగో దశ ప్రారంభమైందని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి గాబ్రియేల్ అట్టల్ ప్రకటించారు. ఈ మహమ్మారి మెరుపువేగంతో వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి తమ దేశంలో కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఫ్రాన్స్ : ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక దేశాలు కొవిడ్ సెకండ్వేవ్, థర్డ్వేవ్ల బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే, వైరస్ ఉద్ధృతి మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు.
తాజాగా, ఫ్రాన్స్ లో వైరస్ నాలుగో దశ ప్రారంభమైందని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి గాబ్రియేల్ అట్టల్ ప్రకటించారు. ఈ మహమ్మారి మెరుపువేగంతో వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి తమ దేశంలో కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఫ్రాన్స్లో సాంస్కృతిక వేదికలు, ఉద్యానవనాలు, స్విమ్మింగ్ పూల్స్ సందర్శించాలనుకునే వారు తప్పకుండా కోవిడ్ టీకా వేసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. అదేవిధంగా కరోనా నెగిటివ్ రిపోర్టు కూడా నివేదించాలని అటల్ పేర్కొన్నారు. ప్రజలందరూ టీకాలను వేసుకోవాలని సూచించారు. నిబంధనలకు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.
ఆగస్టు ఆరంభం నుంచి, రెస్టారెంట్లు, బార్లలో ప్రవేశించడానికి, రైళ్ళలో ప్రయాణించడానికి హెల్త్ పాస్ ను తప్పనిసరి చేసినట్లు తెలిపారు. టీకా వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే హెల్త్పాస్ను జారీచేస్తారని ప్రధాని జీన్ కాస్టెక్స్ తెలిపారు.
ఈ సందర్భంగా, టీకా వేగాన్ని పెంచాలని.. రెండు వారాల్లో ఐదు మిలియన్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉంచనున్నామని అధికారులకు ఆదేశించామని తెలిపారు. అదేవిధంగా, హెల్త్ పాస్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి శిక్షలు వేస్తామని తెలిపారు. వీరికి జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా విధిస్తామని జీన్ కాస్టెక్స్హెచ్చరించారు. ఫ్రాన్స్ లో మంగళవారం నాడు 18 వేల కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
