అమెరికాలో కాల్పులు: నలుగురి మృతి
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు చోటు చేసుకొన్నాయి. బేస్ బాల్ స్టేడియం వెలుపల కాల్పుల్లో నలుగురు మరణించారు. ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వాషింగ్టన్:అమెరికాలో శనివారం నాడు రాత్రి మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్టుగా పోలీసులు తెలిపారు.వాషింగ్టన్లోని బేస్ బాల్ స్టేడియం వెలుపల దుండగులు కాల్పులకు దిగారు. ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్టుగా గుర్తించారు. బేస్ బాల్ స్టేడియంలో ఆట ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటు చేసుకొంది.
ఈ ఘటనతో స్టేడియంలో ఉన్న కొందరు అభిమానులు, ఆటగాళ్లు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.స్టేడియం వెలుపల ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారని కొలంబియా మెట్రోపాలిజటన్ పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో వాషింగ్టన్ నేషనల్స్, సాన్డియాగో మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. అమెరికాలో తరచూ కాల్పులు చోటు చేసుకొంటున్నాయి. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొంటున్నామని పోలీసులు చెబుతున్నా కూడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.