Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో భారత సంతతికి చెందిన ముగ్గురు మృతి

అమెరికాలోని న్యూజెర్సీలో  ఎనిమిదేళ్ల బాలిక సహా మరో ఇద్దరు ఇంటి కొలనులో  శవాలుగా తేలారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురు భారత సంతతికి చెందిన కుటుంబంగా పోలీసులు తేల్చారు.

3 Indian-Origin Family Members Found Dead In Backyard Pool In US: Report
Author
USA, First Published Jun 24, 2020, 3:02 PM IST

న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో  ఎనిమిదేళ్ల బాలిక సహా మరో ఇద్దరు ఇంటి కొలనులో  శవాలుగా తేలారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురు భారత సంతతికి చెందిన కుటుంబంగా పోలీసులు తేల్చారు.

62 ఏళ్ల భారతీ పాటిల్, ఆయన కోడలు 33 ఏళ్ల నిషా పాటిల్ ఆమె 8 ఏళ్ల కూతురు ఈస్ట్ బ్రూన్స్ విక్ లోని తాము నివాసం ఉంటున్న కొలనులో మునిగి చనిపోయారు..ఈ ముగ్గురు ఎలా చనిపోయారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

క్లియర్ వ్యూ రోడ్డులో ఉన్న ఇంట్లో ఈ ముగ్గురు నివసిస్తున్నారు. ఏప్రిల్ మాసంలోనే  ఈ ఇంటిని  451 వేల డాలర్లకు కోనుగోలు చేశారు.సోమవారం నాడు ఈ నివాసంలోని పెరటి నుండి అరుపులు విన్నట్టుగా స్థానికులు పోలీసులకు చెప్పారు.

 కొలనులో పడిన సమయంలో సహాయం కోసం కాపాడాలని అరిచినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

కొలనులో నుండి  ఈ ముగ్గురిని కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఘటన స్థలంలోనే మరణించారు.ఈ ఘటన విషయం తెలుసుకొన్న కుటుంబసభ్యులు ఇక్కడికి వచ్చారు. ఈ విషయం తెలుసుకొన్న తర్వాత మేయర్ బ్రాడ్ కోహెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  స్థానికులు కూడ ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios