థాయ్‌లాండ్‌లోని చోంబూరి ప్రావిన్స్‌లోని నైట్‌క్లబ్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 35 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

థాయ్‌లాండ్‌ : రాజధాని బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా ఉన్న థాయ్‌లాండ్‌లోని చోన్‌బురి ప్రావిన్స్‌లోని నైట్‌క్లబ్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసు అధికారులు సమాచారం తెలిపారు.

ఈ అగ్నిప్రమాదం సత్తాహిప్ జిల్లాలోని మౌంటైన్ B నైట్‌క్లబ్‌లో జరిగింది. ఇది సుమారు 1:00 గంటలకు (1800 GMT గురువారం) ప్రారంభమైందని తెలుస్తోంది. ఇప్పటి వరకు గుర్తించిన బాధితులందరూ థాయ్ జాతీయులని పోలీసు కల్నల్ వుట్టిపోంగ్ సోమ్‌జై టెలిఫోన్ ద్వారా తెలిపారు.