Asianet News TeluguAsianet News Telugu

ఇరాక్ లో భారీ బాంబ్ పేలుళ్లు... పదిమంది మృతి, 20 మందికి గాయాలు

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో శనివారం భారీ పేలుళ్ళ సంభవించారు. ఈ పేలుళ్లలో పదిమంది చనిపోగా మరో 20 మంది తీవ్రగాయాలతో హాస్పిటల్లో చికిత్సపొందుతున్నారు.  

10 killed and 20 injured in explosion in iraq
Author
First Published Oct 30, 2022, 9:34 AM IST

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించాయి. రాజధాని బాగ్దాద్ లోని ఫుట్ బాల్ స్టేడియం సమీపంలోని రద్దీ ప్రాంతంలో బాంబుదాడులకు తెగబడ్డారు. ఈ బాంబ్ పేలుళ్లలో పదిమంది మృతిచెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా వుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 

ఓ వాహనంలో బాంబ్ అమర్చి తూర్పు బాగ్దాద్ లోని రద్దీ ప్రాంతంలో పేలుళ్లకు పాల్పడ్డారు. ఇదే సమయంలో ఓ గ్యాస్ ట్యాంకర్ అక్కడ వుండటంతో అదికూడా పేలడంతో ప్రమాదతీవ్రత మరింత పెరిగిందని ఇరాక్ ఆర్మీ తెలిపింది. మృతులు, గాయపడిన వారిలో చాలామంది చిన్నారులు వున్నట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios