Lancet: మ‌హిళ‌లు,చిన్నారుల ర‌క్ష‌ణ కోసం.. ఎన్ని క‌ఠిన చట్టాల‌ను రూపొందించిన స‌మాజంలో మార్పు రావ‌డం లేద‌ని మ‌రో సారి నిరూపిత‌మైంది. ప్ర‌తి న‌లుగురు మ‌హిళ‌ల్లో ఒకరు గృహ హింస బాధితురాలేన‌ని,  ప్ర‌తి ఏడుగురు మ‌హిళ‌ల్లో ఒక మ‌హిళ( 50 యేండ్ల లోపు) త‌న భాగ‌స్వామి నుంచి హింస‌ను ఎదుర్కొంటోంద‌ని ది లాన్సెట్ జ‌ర్న‌ల్ నిర్వహించిన సర్వేలో వెల్ల‌డైంది.     

Lancet: ఆధునిక స‌మాజంలో మ‌హిళ‌లు ప్ర‌తిరంగంలో అడుగుపెట్టి రాణిస్తున్నారు. వారు అడుగుపెట్టిన‌ ప్ర‌తి రంగంలో త‌మ‌దైన ముద్ర వేస్తున్నారు. త‌మ విజ‌యాల‌తో ఇత‌రుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. అయితే.. ఏ రంగంలో ఎంత అభివృద్ధి చెందినా..  సమాజంలో మహిళల విషయంలో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, గృహహింస అనేవి నిత్య కృత్యాలుగా మారాయి. ప్ర‌భుత్వాలు మ‌హిళ రక్ష‌ణ కోసం ఎన్ని చ‌ట్టాలు తీసుకవ‌చ్చినా.. వాటికి అడ్డుక‌ట్ట వేయలేక పోతున్నాం.  తాజాగా ప్ర‌పంచ వ్యాప్తంగా.. ది లాన్సెట్ జ‌ర్న‌ల్ నిర్వహించిన సర్వేలోనూ అదే విషయం బ‌హిర్గతమయ్యింది. మహిళలకు ఇంటి బయటే కాదు... ఇంట్లో కూడా ర‌క్ష‌ణ లేద‌ని తేటతెల్లమైంది. 

ది లాన్సెట్ జ‌ర్న‌ల్ నివేదిక ప్ర‌కారం.. ప్ర‌తి న‌లుగురు మ‌హిళ‌ల్లో ఒకరు గృహ హింస బాధితురాలేన‌ని,  ప్ర‌తి ఏడుగురు మ‌హిళ‌ల్లో ఒక మ‌హిళ( 50 యేండ్ల లోపు) త‌న భాగ‌స్వామి నుంచి హింస‌ను ఎదుర్కొంటోంద‌ని  ( 13 శాతం)  వెల్ల‌డించింది.  ఈ స‌ర్వే కోసం..మెక్‌గిల్ విశ్వవిద్యాలయం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పరిశోధకుల నేతృత్వంలోని 161 దేశాలకు చెందిన 20 లక్ష‌ల మందికి పైగా మ‌హిళ‌ల‌ను ప్ర‌శ్నించిన మీద‌ట ఈ వివ‌రాలు వెలుగుచూశాయి.  

అలాగే..  15 నుంచి 19 సంవ‌త్స‌రాల‌లోపు యువ‌తుల్లో 24 శాతం మంది త‌మ జీవిత‌కాలంలో అధికంగా గృహ హింస‌ను అనుభ‌వించిన‌ట్టు అంచనా వేసింది. వాస్త‌వానికి ఈ సంఖ్య ఇంకా అధికంగా ఉంటుంద‌ని విశ్వవిద్యాలయం, WHO పరిశోధకులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వాస్త‌వానికి మ‌హిళ‌లు త‌మ‌కు ఎదురైన అనుభ‌వాల‌ను చెప్ప‌డం ముందుకు రావ‌డం లేద‌ని తెలిపింది.  

మ‌హిళ‌ల‌పై శారీర‌కంగా, లైంగికంగా.. భ‌ర్త‌లు, బాయ్‌ఫ్రెండ్స్‌, ఇత‌ర భాగ‌స్వాముల ఆగ‌డాలు ప్రపంచ‌వ్యాప్తంగా అధికంగా న‌మోద‌వుతున్నాయ‌ని విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మాథ్యూ మహ్యూ-గిరోక్స్ చెప్పుకొచ్చారు. అధిక ఆదాయం ఉన్న దేశాల్లో మ‌హిళ‌ల‌పై హింస త‌క్కువ మోతాదులో కనిపించిందని, మహిళలపై జరిగిన హింస స్థాయిల్లో ప్రాంతాల వారీగానూ తేడాలను గుర్తించామ‌ని ఆయన తెలిపారు.

మ‌హిళ హింస‌లోనూ  ప్రాంతీయ వైవిధ్యాలను కనుగొన్నారు పరిశోధకులు. ఇత‌ర ప్రాంతాలతో పోల్చితే.. అధిక-ఆదాయ దేశాల్లో మ‌హిళ‌ల‌పై దాడులు త‌క్కువ‌గా ఉన్న‌ట్టు తెలిపారు.  15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు గృహ హింస‌కు పాల్పడుతున్నార‌నీ,  ఆఫ్రికా, దక్షిణ ఆసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో గృహ హింస‌ అత్యధికంగా ఉందని తెలిపింది.  

గృహ హింస తక్కువగా ఉన్న 30 దేశాల్లో కెనడా ఉంది. కెనడాలో గృహ హింసను పరిష్కరించడానికి వివిధ పద్ధతులను అవలంభిస్తున్నాయని, బాధితుల కోసం ప్రత్యేక కోర్టును రూపొందించడానికి అక్కడి ప్రభుత్వం 2021లో పైలట్ ప్రాజెక్ట్‌ను ఆమోదించిందని పరిశోధకులు తెలియజేశారు.

మొత్తంమీద.. మ‌హిళ‌లు, బాలికలపై హింసను నిర్మూలించడానికి స‌రైన విధానం లేద‌ని. కొన్ని అధిక ఆదాయ దేశాలలో కూడా సన్నిహిత భాగస్వామి హింస సాపేక్షంగా ఎక్కువగా ఉందనీ మహేయు-గిరోక్స్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా, కోవిడ్-19 మహమ్మారి వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశోధకులు వివరించారు. సన్నిహిత భాగస్వామ్య హింసకు ప్రజారోగ్య ప్రతిస్పందనను పటిష్టం చేయడం తక్షణ అవసరం,  కోవిడ్-19 అనంతర పునర్నిర్మాణ ప్రయత్నాలలో ఈ స‌మ‌స్య‌ పరిష్కరించబడుతుందని  తెలిపారు.