Asianet News TeluguAsianet News Telugu

నాచారం డీపీఎస్ స్కూల్‌కు బాంబు బెదిరింపు, పోలీసుల తనిఖీలు

నాచారంలోని ఓ స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు, అధికారులు, పాఠశాల సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. స్థానిక డీపీఎస్ స్కూలులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు మెయిల్ ద్వారా సందేశం పంపాడు. 

bomb scare at  Nacharam DPS school in hyderabad
Author
Hyderabad, First Published Mar 10, 2020, 2:37 PM IST

నాచారంలోని ఓ స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు, అధికారులు, పాఠశాల సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. స్థానిక డీపీఎస్ స్కూలులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు మెయిల్ ద్వారా సందేశం పంపాడు.

దీంతో స్కూలు యజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ హడావిడితో విద్యార్ధులు, చిన్నారులు భయాందోళనలకు గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios