Asianet News TeluguAsianet News Telugu

ఒంటరితనం మతిమరుపు ప్రమాదాన్ని పెంచుతుంది..? దీన్ని ఎలా నివారించాలంటే?

వయసు పెరిగే కొద్దీ మన జీవనశైలి విధానమే కాదు అలవాట్లు కూడా మారిపోతాయి. అయితే 40 సంవత్సరాల వయసున్న వారు ఎక్కువగా ఒంటరిగానే ఉంటారు. కానీ ఈ ఒంటరితనం చిత్తవైకల్యం ప్రమాదాన్ని పెంచుతుంది. 

 These tips can help prevent dementia rsl
Author
First Published Apr 25, 2023, 12:33 PM IST


వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది. వయసు పెరగడం వల్ల మెదడు ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత మతిమరుపు ముప్పు బాగా పెరుగుతుంది. నాడీ కణాలు దెబ్బతినడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ చిత్తవైకల్యం వల్ల లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తాయి. చిత్తవైకల్యం లక్షణాలు వ్యక్తి మెదడు నాడీ ఏ భాగాన్ని ప్రభావితం చేశాయనే దానిపై ఆధారపడి ఉంటాయి. మరి దీన్ని ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

సాధారణంగా 40 సంవత్సరాల వయస్సు తర్వాత మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది చిత్తవైకల్యం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి 40 ఏళ్ల తర్వాత మీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆహారం 

చిత్తవైకల్యం ప్రమాదం తగ్గాలంటే మీ ఆహారంలో మెదడును ఆరోగ్యంగా ఉంచే ఆహారాన్ని చేర్చండి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ బి, విటమిన్ డి 3, పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చండి. ఇవన్నీ మెదడును చురుకుగా ఉంచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కాలే, బ్రోకలీ, బచ్చలికూర వంటి ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్ కె, లుటిన్,  ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే వాల్ నట్స్ చిత్తవైకల్యం ఏర్పడకుండా నిరోధిస్తాయి.

వ్యాయామాన్ని చేయండి

చిత్తవైకల్యాన్ని నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. పెరుగుతున్న వయస్సులో శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాయామం మెదడులో రక్త ప్రసరణను పెంచుతుంది. మెదడు శక్తిని పెంచుతుంది. దీనితో పాటు వ్యాయామం నిద్ర నాణ్యతను ప్రోత్సహిస్తుంది. మీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. చిత్తవైకల్యం రాకూడదంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. 

నిద్ర నాణ్యత

నిద్రలేమి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. అల్జీమర్స్, చిత్తవైకల్యం సమస్యలకు నిద్ర లేకపోవడం ప్రధాన కారణం. మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు గాఢ నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం వల్ల మెదడులో బీటా అమిలాయిడ్ స్థాయి పెరుగుతుంది. ఇది నిద్ర నాణ్యతను ప్రభావితం చేసే ఒక రకమైన ప్రోటీన్. జ్ఞాపకశక్తి బాగుండేందుకు గాఢ నిద్ర చాలా ముఖ్యం. అందుకే క్రమం తప్పకుండా నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్ర నాణ్యతను పెంచడానికి, పడుకోవడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి. 

సామాజిక నిమగ్నత అవసరం

వయసు పెరుగుతున్న కొద్దీ.. ముఖ్యంగా 40 ఏండ్లు దాటిన తర్వాత మహిళలు ఇల్లు, పిల్లల బాధ్యతతో చాలా బిజీగా ఉంటారు. మనస్సును కొన్ని విషయాలకు మాత్రమే పరిమితం చేయడం కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది అల్జీమర్స్, చిత్తవైకల్యం వంటి సమస్యలను కారణమవుతుంది. అందుకే స్నేహితులతో బయటకు వెళ్లండి. చాట్ చేయండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుచుకోండి. వారాంతంలో కనీసం ఒక చిన్న కిట్టీ పార్టీకి అయినా వెళ్లండి. అలాగే మీ చుట్టుపక్కల వారితో స్నేహం చేయండి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios