Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో దారుణం: ప్రియుడితో కలిసి భర్తను చంపి ఇంట్లో పాతిపెట్టిన భార్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ మహిళ తన భర్తను ప్రియుడి సహకారంతో హత్య చేసింది. శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. పోలీసుల విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది.

Wife kills husband in Guntur district of Andhra Pradesh
Author
Guntur, First Published Aug 17, 2020, 5:10 PM IST

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. ప్రియుడితో సహాయంతో ఓ మహిళ తన భర్తను చంపింది. ఆ తర్వాత శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని చెరుకుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

చిరంజీవి అనే వ్యక్తిని భార్య హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. రూ.11 లక్షల కోసం ఆమె ఆ పనికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. చిరంజీవి అదృశ్యం కావడంతో విచారణ చేపట్టిన పోలీసులు అనుమానం వచ్చి భార్యను విచారించారు. 

ఆ విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. కరోనా వైరస్ కారణంగా చిరంజీవి శవాన్ని తవ్వి తీయడంలో ఆలస్యం కావచ్చునని భావిస్తున్నారు. 

చిత్తూరు జిల్లాలో ఇటీవల అటువంటి సంఘటనే జరిగింది. ఓ మహిళ తన భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసింది. తల్లి సహకారంతో ఆమె ఆ పనిచేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం పంచాయతీ నక్కలపల్లి గ్రామంలో ఆ ఘటన చోటు చేసుకుంది. భార్య తన భర్త మర్మాంగాలపై కొట్టి చంపింది.

Follow Us:
Download App:
  • android
  • ios