Asianet News TeluguAsianet News Telugu

నీయమ్మా మొగుడికి ఇవ్వాలా ఫించను...ఆ మంత్రి సమాధానం ఇలాగే: వర్ల రామయ్య

రాష్ట్రవ్యాప్తంగా భారీఎత్తున పించన్లు, రేషన్ కార్డులు తొలగిస్తూ  వైసిపి ప్రభుత్వం నిరుపేదల కడుపుపై కొడుతోందని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య ఆరోపించారు. 

Varla Ramaiah Slams kodali nani Over His Unparliamentary Language
Author
Guntur, First Published Feb 10, 2020, 9:09 PM IST

గుంటూరు: నిరాదరణకు గురైన వృద్దులు, వికలాంగులు, వితంతువులు, అనాధ మహిళలపై వైసీపీ ప్రభుత్వం ప్రతాపం చూపుతోందని టిడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 

మంగళగిరిలోని టిడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవిత చరమాంకంలో కుటుంబ సభ్యుల ఆదరణ కోల్పోయిన వృద్దులకు, వికలాంగులు, వితంతువులు, అనాధ మహిళలకు  అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారి ఫించన్లు తొలగించటం  దుర్మార్గమన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటికి నుండి రాష్ట్రంలో 7 లక్షల ఫించన్లు తొలగించారని ఆరోపించారు.

''తాము ఎన్టీఆర్‌ హయాం నుంచి ఫించన్లు తీసుకుంటున్నామని...చంద్రబాబు వచ్చిన తర్వాత 200 నుంచి రూ. 2 వేలకు పెంచారు. కానీ జగన్‌ ఎన్నికలకు ముందు రూ. 3 వేల ఫించన్‌ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఫించన్లు తొలగించి మా నోట్లొ మట్టికొట్టారు.'' అని వృద్దులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

read more  అందుకోసమే అధికారులపై వేటు... వైసిపి ప్రణాళిక ఇదే...: అచ్చెన్నాయుడు

''గిరిగిరా తిరిగింది ఫ్యాన్‌ పోయింది నా ఫించన్‌'' అంటూ మహిళలు నినదిస్తున్నారని అన్నారు. ఫించన్లు తొలగిస్తే ఆధారంలేని వృద్దులు ఎలా బ్రతకాలని  ప్రశ్నించారు. వివిధ నిబందనలతో  ఫించన్లు తొలగించి 7 లక్షల మందిని ముఖ్యమంత్రి జగన్‌ రోడ్డున పడేశారని... వారికి అన్నం పెట్టే దిక్కెవరని నిలదీశారు.   

కోట్లకు పడగలెత్తిన జగన్‌ పేదల నోటికాడ కూడు లాగేయటం దుర్మార్గమన్నారు. సీఎం జగన్‌ వీరికి సమాధానం చెప్పకపోయినా ఒక రోజు దేవునికి సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. క్రమం తప్పకుండా చర్చికెళ్తానని చెప్తున్న జగన్‌... యేసు క్రీస్తు చూపించిన కరుణ, జాలి, దయలో కనీసం 1 శాతం కూడా చూపటం లేదని రామయ్య మండిపడ్డారు.

''పేదల పింఛన్లు అన్యాయంగా తొలగించారు. పింఛన్ల తొలగింపుపై ప్రభుత్వాన్ని పేదలు నిలదీస్తున్నారు. దీనికి సీఎం జగన్‌ ఏం సమాధానం చెప్తారు. పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లులో మధుర  మీనాక్షి అనే 103 ఏళ్ల వృద్ధురాలి పింఛన్‌ తొలగించారు. ఆమెకు ఎన్టీఆర్‌ హయాం 1987 నుంచి వస్తున్న ఫించన్‌ ఇప్పుడు నిలిపివేశారు. ఆమె వయస్సు 3 సంత్సరాలుగా పడిందని చెప్పి ఆపేశారు'' అని వివరించారు.

read more  వైసిపిలో అసమ్మతి సెగలు... మహాఅయితే మరో మూడేళ్లు మాత్రమే...: బుచ్చయ్య చౌదరి

''అలాగే 2007లో  భర్త చనిపోతే అతడింకా బ్రతికే ఉన్నాడని మరో ముస్లిం వితంతు ఫించను ఆపేశారు. ఆమె తన భర్తను చూపించాలంటూ అధికారులను నిలదీసింది. పింఛన్ల తొలగింపుపై పౌరసరఫరాల శాఖ మంత్రి స్పందించమని వృద్దులు అడిగితే నీయమ్మ మెగుడుకి ఇవ్వాలా ఫించన్‌ అంటారేమో'' అని అన్నారు.  

''వికలాంగుల పింఛన్లు సైతం తొలగిస్తున్నారు. భీమిలిలో పింఛన్లు తొలగింపుపై మంత్రి అవంతి సమాధానం చెప్పాలి.  టీడీపీలో ఉన్నపుడు నీతి కధలు చెప్పిన అవంతి వైసీపీలోకి చేరారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ఆ పార్టీలో గద్దలా వాలుతారు. ఇలా పార్టీలు మారేవారిని ప్రజలు బియ్యంలో రాళ్లు ఏరేసినట్లు ఏరెయ్యాలి'' అని సూచించారు. 

''ఫించన్ల తొలగింపుపై బాధితులు ఎవరిని అడగాలి. తమ ఫించన్ల ఎందుకు తొలగించారని వారు ప్రశ్నిస్తే  వారిపైన కూడా కేసులు పెడతారా? నేడు ఫించన్ల తొలగింపుపై టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఆందోళనలకు ఫించన్ల కోల్పోయిన వారంతా తరలివచ్చారు.  ఫించన్లు తొలగించిన వృద్దులను చూసి ఒక మహిళా ఎమ్మార్వో తానమే చేయలేనంటూ కంటతడి పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 ఏళ్లకే ఫించను ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశారు.  పేదల ఫించన్లు తొలగించి వారి ఉసురు పోసుకోవద్దు. రద్దు చేసిన 7 లక్షల ఫించన్లు తిరిగి ఇవ్వాలి'' అని వర్ల రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios