Asianet News TeluguAsianet News Telugu

రాజీనామాలకు సిద్దమే... లేదంటే:మంత్రి బుగ్గనకు అనురాధ సవాల్‌

తెలుగుదేశం పార్టీ కేవలం ఒకే ఒక సామాజికవర్గం కోసమే రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారన్నది దుష్ప్రచారమేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.  

tdp leader panchumarthi anuradha challenge to minister buggana
Author
Guntur, First Published Dec 23, 2019, 2:58 PM IST

అమరావతి: కేవలం ఒకే సామాజిక వర్గంకోసం టిడిపి ప్రభుత్వం రాజధానిని అమరావతిలో ఏర్పాటుచేసిందంటూ వైసిపి నాయకులు కావాలనే విష ప్రచారం చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. అయితే తమ ప్రభుత్వం ఏర్పాటుచేసింది దళిత, బడుగు బలహీన వర్గాల రాజధాని అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. 

రాజధాని అమరావతికి తూట్లు పెట్టి అధికార పార్టీ సినిమా చూసినట్లు చూస్తోందని... కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా అటువైపు చూడటంలేదని ఆరోపించారు. ఇందుకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. సామాజిక వర్గం అని మాట్లాడే వైసిపి నాయకులు వైజాగ్‌లో ఏ సామాజికవర్గంతో వ్యాపారం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.  వైవి సుబ్బారెడ్డి భాగస్వామి ఎవరో వారి మనస్సాక్షికి తెలుసన్నారు. 

వైసీపీ నాయకులు మాట్లాడితే ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ అంటున్నారని అసలు దాని గురించి వారికసలు ఏం తెలియదన్నారు. జూన్‌ 2వ తేది  తెలుగుదేశం పార్టీ  అధికారంలోకి రావడం జరిగిందని... సెప్టెంబర్‌ 4 వ తేదిన అమరావతిని రాజధానికి ప్రకటించడం జరిగిందన్నారు.  ఈ నాలుగు నెలల కాలంలో రాజధాని ప్రాంతంలో 125 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్‌ జరిగితే మీరు ఎలా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని చెబుతారని నిలదీశారు. 

4 వేల ఎకరాలు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. నిజంగా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని మీరు నిరూపిస్తే మేము రాజీనామా చేస్తాం... నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? ఈ ఛాలెంజ్‌కు వారు సిద్ధమేమో చెప్పాలని అన్నారు. 

చంద్రబాబునాయుడు ఒక విజన్‌ ఉన్న నాయకుడని... ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడంలో ముందున్న నాయకుడన్నారు. తెలుగుదేశం హయాంలో వైజాగ్‌ను ఆర్థిక రాజధానిగా చేయటానికి అన్ని ప్రయత్నాలు సఫలీకృతం చేయటం జరిగిందన్నారు. ప్రస్తుతం జగన్ క్యాంప్‌ ఆఫీస్‌ పెట్టాలనుకున్న మిలీనియం టవర్స్‌ కూడా చంద్రబాబునాయుడు కట్టించినదే పేర్కొన్నారు. అదేవిధంగా అక్కడున్న టెంపుల్స్‌నుగానీ, లూలూ కంపెనీలు, అదానీ కంపెనీలు, పరిశ్రమలను తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబేనని అన్నారు.  

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిధులు కేటాయించటయే కాదు ఫస్ట్‌ ఫేస్‌ కూడా తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తిచేయడం జరిగిందన్నారు. అలాగే తోటపల్లి రిజర్వాయర్‌ ద్వారా 90 వేల ఎకరాలకు నీరందించటం జరిగిందన్నారు. ఉత్తరాంధ్రతో పాటు 13 జిల్లాల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, మొబైల్‌ ఫోన్ల తయారీ, ఆక్వా కల్చర్‌, ఆటో మొబైల్స్‌ తీసుకురావటం జరిగిందని తెలిపారు. 

reda more  ఏపీ రాజధాని వివాదం: రైతులకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు!

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో లావా అవంతి సీడ్స్‌, పతాంజలి, జయ్‌ ఇరిగేషన్‌ , పార్లే, జెర్సీ ఇండస్ట్రిస్‌ గ్రూప్‌, టాటా ఫ్రూట్స్‌, ఐటిసి ఇంకా మరిన్ని పరిశ్రమలు తీసుకురావటం జరిగిందన్నారు. ఆటో మొబైల్స్‌ రంగంలో కియా మోటార్స్‌, అపోలో, అశోక్‌లైలాండ్‌, భారత్‌ ఫోర్స్‌, హీరో గ్రూప్స్‌ ఇవన్నీ కూడా రావడం జరిగిందన్నారు.

సెల్‌ఫోన్‌ తయారీ రంగంలో ఫ్రాగ్స్‌ కాల్‌, ఎలక్ట్రానిక్స్‌, డిక్సిన్‌, టిసిఎల్‌, వోల్టా వంటి పరిశ్రమలు తీసుకురావటం జరిగిందని అన్నారు. ఫార్మా రంగంలో స్పైరా హెల్త్‌ కేర్‌, డాక్టర్‌ రెడ్డి ల్యాబ్స్‌, లూపిన్స్‌, అరవింద ఫార్మా, దివి ల్యాబ్స్‌, నాట్కో ఫార్మా తదితర కంపెనీలు తీసుకురావటం జరిగిందన్నారు.

కృష్ణపట్నం, ఓర్వకల్లు, హిందూపురం నియోజకవర్గాల్లో  సీబీఐసీ కింద 3 పారిశ్రామిక రోడ్లను అభివృద్ధి చేయటం జరిగిందని వెల్లడించారు. విశాఖపట్నం, శ్రీకాళహస్తి, మచిలీపట్నం, దొనకొండ ఈ నాలుగు చోట్ల పారిశ్రామిక అభివృద్ధిని తీసుకురావటానికి కృషి చేసినట్లు తెలిపారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఫుడ్‌ పార్కులు... కడప, చిత్తూరు జిల్లాలలో సమీకృత ఫుడ్‌ పార్కులు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. 

కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంటుతోపాటు మెగా పారిశ్రామిక పార్కు కోసం 6,553 ఎకరాలు సేకరించడం జరిగిందని గుర్తుచేశారు.  తెలుగుదేశం ప్రభుత్వం 13 జిల్లాల అభివృద్ధిని కాంక్షించి 60 శాతం పనులు పూర్తి చేస్తే కేవలం మీ వ్యాపారాల కోసం 3 చోట్ల రాజధానులు పెడతారా? అని  అనురాధ  నిలదీశారు. 

 ఉత్తరాంధ్రలో విరివిగా లభించే టైటానియంను కొల్లగొట్టడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పావులు కదుపుతోందన్నారు. న్యూక్లియర్‌ బాంబులో ఉపయోగించే ఈ పదార్థాన్ని అమ్ముకోవటం కోసం కెవిపి రామచంద్రరావు, కోనేరు ప్రసాద్‌, జగన్మోహన్‌రెడ్డి బినామీలతో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు... దీనికి సంబంధించి కేవీపీ కి అంతర్జాతీయ ఇంటర్‌పోల్‌ నోటీసు ఇస్తే స్టే తెచ్చుకొని దాక్కొని ఉన్నారని ఆరోపించారు.

read more  డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ఎలా జరగనుందంటే: మంత్రి అజయ్

 జగన్మోహన్‌రెడ్డి మిత్రుడొకరిని  కూడా విదేశాల్లో అరెస్టు చేశారని గుర్తుచేశారు.  ఈ విధంగా ఉత్తరాంధ్రను రౌడీయిజం, దౌర్జన్యం, దగా చేసి దోచుకోవాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  కులమంటే అంటని ప్రాంతం విశాఖపట్నం... అందుకనే విజయలక్ష్మిని ఓడించారని అన్నారు. విజయవాడతో పోల్చిస్తే 10రేట్లు, గుంటూరుతో పోల్చిస్తే 15 రెట్లు ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం విశాఖపట్నమని అనురాధ పేర్కొన్నారు. 

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. రెండు కుర్చీలు, రెండు బేంచీలు వేసి ఎగ్జిక్యూటివ్‌ రాజధాని అంటూ నాశనం చేయటానికి వైసీపీ కంకణం కట్టుకుని ఉందన్నారు. ఎగ్జిక్యూటివ్‌ రాజధాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని.... అమరావతిలోని రాజధాని ప్రజల ఆందోళన కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి అనురాధ కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios