Asianet News TeluguAsianet News Telugu

పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు... ఏటీఎంలో నగదు నింపే వాహనంలోంచి 36లక్షల చోరీ

గుంటూరు జిల్లాలో పట్టపగలే భారీ  దొంగతనం చోటుచేసుకుంది. 

ATM loading vehicle robbed in guntur dist
Author
Guntur, First Published Jun 9, 2020, 7:05 PM IST

అమరావతి: గుంటూరు జిల్లాలో పట్టపగలే భారీ  దొంగతనం చోటుచేసుకుంది. సినీ పక్కీలో ఏటిఎంలో నగదును నింపే వాహనంలో నుండి దాదాపు 36లక్షలను అత్యంత చాకచక్యంగా దోపిడీ చేశారు దుండగులు. ఈ చోరీ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

ఈ దోపిడీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు పట్టణ సమీపంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన గల ఏటిఎంలో నగదు నిల్వ చేయడానికి వచ్చిన వాహనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాన్లో ఉన్న నలుగురు సిబ్బంది ఏటిఎం లోకి వెళ్లటంతో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన దొంగలు వాహనంలోని డబ్బును తీసుకుని పరారయ్యారు. వారు దొంగిలించిన నగదు దాదాపు  36లక్షలు వుంటుందని సమాచారం. 

read more  విజయవాడ గ్యాంగ్‌వార్: పనిచేయని పండూ చేతివేలు, న్యూరో జర్జరీ విభాగంలో పరీక్షలు

ఈ దోపిడీపై వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి దొంగలను పట్టుకోవాలని నల్లపాడు పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దోపిడీకి పాల్పడిన  దుండగులు వ్యాన్లో ఉన్న నలుగురు సిబ్బందిలో ఎవరో ఒకరికి సంబందించిన వ్యక్తులు అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios