MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ముఖానికి అరటిపండును పెడితే ఏమౌతుందో తెలుసా?

ముఖానికి అరటిపండును పెడితే ఏమౌతుందో తెలుసా?

సాధారణంగా అరటిపండును తినడానికి మాత్రమే ఉపయోగిస్తాం. కానీ ఈ పండు స్కిన్ కేర్ గాకూడా ఉపయోగపడుతుంది. అవును ఈ పండు గుజ్జును ముఖానికి పెడితే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

2 Min read
Shivaleela Rajamoni
Published : Oct 17 2024, 12:12 PM IST| Updated : Oct 17 2024, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనలో చాలా మంది అరటిపండును రెగ్యులర్ గా తింటుంటారు. ఈ పండు టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. కానీ ఈ పండును ఉపయోగించి మనకున్న ఎన్నో చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. 

25

నిపుణులు ప్రకారం.. బాగా పండిన అరటిపండు మన చర్మానికి ఎంత మేలు చేస్తుంది. ఈ పండులో ఉండే గుణాలు మన చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. అలాగే బాగా పండిన అరటిపండును ముఖానికి రాసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది

అరటిపండు మన చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే అరటిపండును అరటి పండును చర్మానికి అప్లై చేయడం వల్ల మన చర్మానికి తేమ అందుతుంది. అలాగే స్కిన్ డ్రై అయ్యే అవకాశం కూడా పోతుంది. అరటిపండును ఉపయోగించి నిర్జీవమైన, నిస్తేజమైన చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. డ్రై స్కిన్ ఉన్నవారికి ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.
 

35
banana

banana

హైడ్రేట్ చేస్తుంది

అరటి పండును ముఖానికి రాసుకోవడం వల్ల మీ చర్మం హైడ్రేట్ అవుతుంది. అలాగే ఇది మన ముఖాన్ని కాంతివంతంగా, మెరిసేలా చేస్తుంది. ఈ అరటిపండును వాడితే మన చర్మం మునుపటి కంటే మరింత అందంగా మెరిసిపోతుంది.

వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది

ముఖంపై ముడతలు, గీతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేయడానికి అరటిపండు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ పండులో విటమిన్ -సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల మీ చర్మం బిగుతుగా అవుతుంది. దీంతో వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి.
 

45

మరకలు తొలగిపోతాయి 

అరటి పండ్లలో ఉండే లక్షణాలు మన చర్మాన్ని మరింత మెరిసేలా చేయడానికి బాగా సహాయపడతాయి. దీన్ని తరచుగా ముఖానికి రాయడం వల్ల మీ ముఖంపై ఉండే మరకలు, మొటిమల మచ్చలు, ఇతర మచ్చలు లేకుండా పోతాయి. 

మొటిమలు తగ్గుతాయి

అరటి పండ్లలో ఉండే పోషకాలు మన చర్మంపై ఉండే అదనపు నూనెను తొలగించడానికి బాగా సహాయపడతాయి. దీన్ని ఉపయోగించి ముఖంపై ఉండే మొటిమలు పూర్తిగా తొలగించొచ్చు. అలాగే ఇది మొటిమల వల్ల అయ్యే మచ్చలను కూడా పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది. 
 

55


మృత కణాలను తొలగిస్తుంది

అరటి పండు గుజ్జును ముఖానికి పెట్టడం వల్ల మీ చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. దీంతో ముఖంపై ఉన్న నల్ల మచ్చలు పూర్తిగా పోతాయి. దీంతో మీ ఫేస్ క్లియర్ గా ఉంటుంది. 

ఎలా ఉపయోగించాలి?

బాగా పండిన ఒక అరటి పండును తీసుకుని మెత్తగా నూరి దాంట్లో తేనె మిక్స్ చేయండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేయండి. అరటి పండుతో చేసిన ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved