MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • రాఖీ పండగ రోజున అంబానీ కూతురు ఏం చేసిందో తెలుసా? ఏకంగా రూ.100కోట్ల డీల్..!

రాఖీ పండగ రోజున అంబానీ కూతురు ఏం చేసిందో తెలుసా? ఏకంగా రూ.100కోట్ల డీల్..!

 అంబానీ కుమార్తె, రిలయన్స్ రిటైల్ అధిపతి  ఈషా అంబానీ రాఖీ పండగ సందర్భంగా భారీ డీల్ చేసింది. ఇప్పటి వరకు టెలికాం రంగంలో ఉన్న ఈ ఫ్యామిలీని కాస్మెటిక్ రంగంలోకి కూడా ఎంట్రీ చేసింది. ఇటలీకి చెందిన కికో మిలానో అనే కాస్మెటిక్ బ్రాండ్ తో 100 కోట్లకు పైగా విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా కికో మిలానో ఉత్పత్తులు భారతదేశంలో అనేక దేశీయ , విదేశీ ఉత్పత్తులకు గట్టి పోటీని ఇవ్వనున్నాయి.

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 22 2024, 09:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రాఖీ పండగ రోజున అమ్మాయిలందరూ తమ సోదరులకు రాఖీలు కడుతుంటారు. దాదాపు వారికి సంబంధించిన కథలే వినపడుతూ ఉంటాయి. కానీ అంబానీ కుమార్తె ఇషా అంబానీ మాత్రం.. ఓ వ్యాపార డీల్ తో వార్తల్లో నిలిచింది. 

 

27

ఈషా అంబానీ దేశంలోనే కాదు, ప్రపంచంలోని అగ్ర పారిశ్రామికవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ కుమార్తె. ఆమె రాజస్థాన్‌లోని జుంఝును జిల్లాకు చెందిన పిరమల్ కుటుంబానికి కోడలు.

37

ప్రస్తుతం  ఈషా అంబానీ రిలయన్స్ రిటైల్ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా  రాఖీ పండగ సందర్భంగా  ఈషా అంబానీ ఇటలీకి చెందిన కాస్మెటిక్ బ్రాండ్ కికో మిలానోతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

47

ఈ ఇటాలీ కాస్మెటిక్ బ్రాండ్‌తో దాదాపు రూ. 100 కోట్లకు పైగా విలువైన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా విడుదలయ్యే ఉత్పత్తులు భారతదేశంలో ఉన్న అనేక దేశీయ, విదేశీ ఉత్పత్తులకు గట్టి పోటీని ఇస్తాయి.

57

ఈషా అంబానీతో ఒప్పందం కుదుర్చుకున్న ఇటలీ కంపెనీ కికో మిలానో 12 కంటే ఎక్కువ స్కిన్ కేర్ , ఇతర బ్యూటీ ఉత్పత్తులను తయారు చేయనుంది. 

67

ఈషా అంబానీ ఒప్పందం ఇతర కంపెనీలతో  కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఆమె అంతర్జాతీయ బ్యూటీ బ్రాండ్ టియెర్రాను కూడా తన సంస్థలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు కాస్మెటిక్ బ్రాండ్ తో డీల్ చేసుకోవడం విశేషం.

77

మీడియా కథనాల ప్రకారం, ఈషా అంబానీ విదేశీ కంపెనీ కికోతో కలిసి 6 నగరాల్లో బ్రాండ్ స్టోర్‌లను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈషా అంబానీతో ఒప్పందం కుదుర్చుకున్న కికో స్టోర్‌లు దేశంలోని ప్రముఖ మహానగరాలైన ఢిల్లీ, ముంబై, పూణే, లక్నో వంటి పెద్ద నగరాల్లో ప్రారంభం కానున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం కానున్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika: బంగారం కాదు.. పెళ్లికి రష్మిక ధరించిన చెప్పుల ధర ఎంతో తెలుసా?
Recommended image2
Temple Jewellery: అదిరిపోయే డిజైన్ లో టెంపుల్ జ్యువెలరీ.. చూసేయండి
Recommended image3
Gold Earrings: లైట్ వెయిట్ లో బంగారు కమ్మలు.. ఓ లుక్కేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved