MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • బియ్యం, పప్పు, గోధుమలకు పురుగు పట్టకుండా ఉండేందుకు ఈ ఒక్క పనిచేస్తే సరి..

బియ్యం, పప్పు, గోధుమలకు పురుగు పట్టకుండా ఉండేందుకు ఈ ఒక్క పనిచేస్తే సరి..

బియ్యం, పప్పులు, జొన్నలతో పాటుగా ఇంట్లో ఎలాంటి ధాన్యాలు ఉన్నా.. కొంతకాలం తర్వాత పురుగులు ఖచ్చితంగా పడతాయి. వీటిని అలాగే వదిలేస్తే మొత్తాన్ని పాడు చేస్తాయి. మొత్తం తినేస్తాయి. అందుకే ధాన్యాలకు పురుగుపట్టకుండా చూసుకోవాలి. అయితే ఒక పద్దతి పురుగులు పట్టకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

2 Min read
Shivaleela Rajamoni
Published : Mar 27 2024, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బియ్యం, జొన్నలు, పప్పులను మళ్లీ మళ్లీ ఎవరు కొంటారని చాలా మంది వీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకుని ఇంట్లో పెడతారు. కానీ కొన్ని రోజుల తర్వాత పురుగు పడుతుంది. ఈ పురుగు ఒక్కొక్కటిగా పెరిగి చాలా అవుతాయి. ఒకదాని నుంచి మరొక దానిలోకి వెళ్లి ఇంట్లో ఉన్న బియ్యం, పప్పులు, జొన్నలు, గోధుమలను తినేస్తాయి. పనికిరాకుండా చేస్తాయి. వీటిని ఏం చేసినా పోగొట్టలేమని చాలా మంది అనుకుంటారు. కానీ ఒక సింపుల్ పద్దతిలో బియ్యానికి, గోధుమలు వంటి ఇతర ధాన్యాలకు పురుగుపట్టకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

25

గోధుమలు, బియ్యం బస్తాలో ఉప్పు వేస్తే ఏమౌతుంది? 

బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలను నిల్వ చేసే సంచుల్లో ఉప్పును ఎప్పుడైనా కలిపారా? ఇలా చాలా తక్కువ మంది చేస్తారు. కానీ ఇది బియ్యానికి, గోధుమలకు పురుగులు పట్టకుండా చేసే చాలా పాత పద్దతి. ఉప్పుతో పురుగులు పట్టవా అని డౌట్ రావొచ్చు. కానీ పట్టవు. ఎందుకంటే ఉప్పులో సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఈ వాసన వల్ల పురుగులు, కీటకాలు ధాన్యాల నుంచి పారిపోతాయి.
 

35
rice

rice

ఇతర పద్దతులు

బియ్యాన్ని, పప్పులు, జొన్నలు వంటి ధాన్యాలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి మీరు వేప ఆకులను, అగ్గిపుల్లలు, లవంగాలు మొదలైన వాటిని కూడా ఉపయోగించొచ్చు. వీటికి కూడా పురుగులను పట్టకుండా చేసే లక్షణాలు ఉంటాయి. 

45

ఈ రోజు నుంచి ఇలా చేయండి

మీరు బియ్యాన్ని లేదా పప్పులు లేదా గోధుమలు మొదలైన  ధాన్యాలను నిల్వ చేసినప్పుడు వాటిని ఉంచే కంటెనైర్ లేదా సంచి క్లీన్ గా ఉందో లేదో చూసుకోండి. వాటిలో ధాన్యాలను పోయడానికి ముందు కాసేపు ఎండలో ఉంచండి. దీనితో పాటుగా ధాన్యాన్ని నిల్వ చేయడానికి ముందు ధాన్యాన్ని బాగా ఎండబెట్టండి.
 

55

ఎక్కువ రోజులు ధాన్యం నిల్వ ఉండాలంటే వాటిలో తేమ ఉండకూడదు. ధాన్యంలో తేమ కారణంగా అందులో కీటకాలు, ఫంగస్ ముప్పు పెరుగుతుంది. అలాగే ధాన్యాలున్న డబ్బాను నేరుగా నేలపై ఉంచకుండా కొంచెం ఎత్తులో ఉంచండి. ఇలా చేయడం వల్ల ధాన్యంలో తేమ ఉండదు. దీనితో పాటుగా ధాన్యాలను తేమగా ఉన్నదగ్గర వీటిని నిల్వ చేయకూడదు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
5 గ్రాముల్లో బంగారు బ్రేస్లెట్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో
Recommended image2
పాత వెండి పట్టీలు కొత్తవాటిలా మెరవాలంటే ఇలా చేయండి!
Recommended image3
రెండు గ్రాముల్లో అదిరిపోయే బంగారు కమ్మలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved