MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Travel
  • Sri Lanka Tour : కేవలం రూ.4,250 తో శ్రీలంక టూర్

Sri Lanka Tour : కేవలం రూ.4,250 తో శ్రీలంక టూర్

అందమైన ప్రకృతి అందాలకు నిలయం శ్రీలంక. భారత్ నుండి ఆ దేశానికి కేవలం రూ.4,250 లతో చేరుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.     

2 Min read
Arun Kumar P
Published : Feb 22 2025, 06:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Sri Lanka Tour

Sri Lanka Tour

పొరుగుదేశం శ్రీలంక ప్రకృతి అందాలతో నిండిఉంటుంది. అందువల్లే మన దేశంనుండి శ్రీలంక సందర్శనకు చాలామంది ప్రకృతి ప్రేమికులు వెళుతుంటారు. అయితే సముద్ర అందాలను ఆస్వాదిస్తూ శ్రీలంకకు వెళ్లడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. కేవలం రూ.4,250 కే తమిళనాడు నుండి శ్రీలంకకు షిప్ లో వెళ్లవచ్చు. 

తమిళనాడులోని నాగై నుంచి శ్రీలంకలోని కాంకేసంతురైకి ప్యాసింజర్ షిప్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌ను 2023లో ప్రధాని నరేంద్ర మోదీ స్టార్ట్ చేశారు. ప్రతి సంవత్సరం వాతావరణం అనుకూలించక నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఈ షిప్ సర్వీస్‌ను తాత్కాలికంగా ఆపేస్తారు. ఆ తర్వాత మెయింటెనెన్స్ పనులు పూర్తిచేసి తిరిగి ప్రారంభిస్తారు. ఇలా సుభమ్ కంపెనీకి చెందిన "శివగంగ" షిప్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ నాగై పోర్టు నుంచి ఇవాళ మళ్లీ స్టార్ట్ అయింది. 

25
నాగై నుంచి శ్రీలంకకు షిప్ సర్వీస్

నాగై నుంచి శ్రీలంకకు షిప్ సర్వీస్

ఇవాళ ఫిబ్రవరి 22 శనివారం ఉదయం 6 గంటలకు పోర్టుకు వచ్చిన ప్యాసింజర్లను అధికారులు చెక్ చేశాక షిప్‌లోకి ఎక్కించారు. ఇలా షిప్‌లోకి చేరుకున్న ప్రయాణికులకు సిబ్బంది రోజా పువ్వులు ఇచ్చి సాదర స్వాగతం పలికారు.  

35
టికెట్ ధర తగ్గింది

టికెట్ ధర తగ్గింది

నాగై నుంచి శివగంగ షిప్‌లో 83 మంది ప్యాసింజర్లు ఉదయం శ్రీలంకకు వెళ్లారు. అలాగే మధ్యాహ్నం శ్రీలంకలోని కాంకేసంతురై నుంచి నాగైకి బయలుదిన షిప్‌లో 85 మంది ప్యాసింజర్లు ఇండియాకు వచ్చారు. ప్యాసింజర్లను అట్రాక్ట్ చేసేందుకు శ్రీలంకకు వెళ్లడానికి ఒకవైపు టికెట్ ధర 4250 రూపాయలు, రెండువైపులా కలిపి 8,500 రూపాయలుగా  ఫిక్స్ చేశారు. 

45
ఉదయం, మధ్యాహ్నం భోజనం ఫ్రీ

ఉదయం, మధ్యాహ్నం భోజనం ఫ్రీ

ఈ షిప్ లో ప్రయాణించే ప్యాసింజర్లకు ఉదయం, మధ్యాహ్నం భోజనం ఫ్రీగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఒక ప్యాసింజర్‌కు 10 కిలోల వరకు సామాన్లు ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. ఎక్కువ లగేజ్ ఉంటే కిలోకు 50 రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తారు. 

55
శ్రీలంక, ఇండియా టూర్

శ్రీలంక, ఇండియా టూర్

శ్రీలంక, ఇండియా మధ్య మంచి సంబంధాలు ఏర్పడాలనే ఈ షిప్ సర్వీస్‌ను స్టార్ట్ చేసినట్లు షిప్ కంపెనీ డైరెక్టర్ సుభశ్రీ సుందర్‌రాజ్ చెప్పారు. త్వరలోనే 250 మంది వెళ్లగలిగే ఫాస్ట్ షిప్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపారు.

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved