ఈ గుడిలో వేలాది ఎలుకలు ... ఒక్క తెల్ల ఎలుక కనిపించిందో జీవితమే మారిపోతుందట
భారతదేశంలో చాలా ప్రాచీన ఆలయాలు ఉన్నాయి... కానీ కొన్ని ఆలయాలు చాలా మహిమ కలిగి సరికొత్తగా ఉన్నాయి. ఇలా ఓ ఆలయమంతా ఎలుకలతో నిండిపోయి వుంటుంది... అక్కడ తెల్లఎలక కనిపిస్తే అదృష్టమట. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Karni Matha Temple
Famous Temples in Rajasthan: భారతదేశంలో పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్దిచెందిన రాష్ట్రం రాజస్థాన్. ఇక్కడ కేవలం ప్రాచీన కోటలే కాదు పెద్దఎత్తున పురాతన హిందూ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మనిషి ఊహకందని మహిమలను కలిగిఉన్నాయి. ఇవి ఎంత ఫేమస్ అంటే మన దేశంనుండే కాదు ప్రపంచం నలుమూలల నుంచి కూడా మొక్కులు తీర్చుకోవడానికి ఈ దేవాలయాలకు భక్తులు వస్తుంటారు. ఇలా రాజస్థాన్ లోని ఫేమస్ గుళ్ల గురించి తెలుసుకుందాం.
1. కర్ణి మాత గుడి (Karni Mata Temple) :
ఎలుకల గుడిగా ఫేమస్ అయిన కర్ణి మాత గుడి బికానెర్ జిల్లాలోని దేశ్నోక్లో పట్టణంలో ఉంది. ఈ గుడి దుర్గాదేవి అవతారంగా భావించే కర్ణి మాతకు అంకితం చేయబడింది. ఈ గుడిని 15వ శతాబ్దంలో మహారాజా గంగా సింగ్ కట్టించారు. దీని ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడితే గుడిలో అందమైన పాలరాతి గేట్లు, వెండి జాలీలు ఉన్నాయి.
ఈ గుడిలో చాలా ఎలుకలు కనిపిస్తాయి. కర్ణి మాత గుడిలో దాదాపు 25,000 నల్ల ఎలుకలు ఉన్నాయని చెబుతారు. వీటిని ఇక్కడ కాబా అని పిలుస్తారు. అంతేకాకుండా ఇక్కడ తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చేవాళ్లు తెల్ల ఎలుకలు కనిపించడం చాలా మంచిదని నమ్ముతారు. వాటిని చూడటం శుభసూచకంగా భావించి జీవితంతో మంచి జరుగుతుందని నమ్ముతారు.
Famous Temples in Rajasthan
మెహందీపూర్ బాలాజీ గుడి (Mehndipur Balaji Temple)
దేశంలోని ప్రముఖ హనుమాన్ ఆలయాల్లో ఈ మెహందీపూర్ బాలాజీ ఆలయం ఒకటి. ఈ గుడిలోని దేవుడిని దర్శించుకుంటే దెయ్యాలు, భూతాల బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడికి వచ్చే భక్తులు తమ శారీరక, మానసిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు.
ఈ గుడిలో ముఖ్యంగా మూడు దేవుళ్లను పూజిస్తారు. బాలాజీ, భైరవ బాబా, ప్రేతరాజ్ సర్కార్. మెహందీపూర్ బాలాజీ గుడిలోని హారతి, భోగ్ లాంటివి చాలా పవర్ ఫుల్ గా భావిస్తారు. నెగెటివ్ ఎనర్జీల వల్ల బాధపడుతున్న భక్తులకు ఈ గుడి చాలా ఫేమస్.
బ్రహ్మ గుడి పుష్కర్ (Brahma Temple Pushkar) :
ప్రపంచంలో బ్రహ్మ గుళ్లు చాలా తక్కువ ఉన్నాయి. వాటిలో పుష్కర్లోని బ్రహ్మ గుడి ఒకటి. ఈ గుడి బ్రహ్మ దేవుడికి అంకితం చేయబడింది. ఈ గుడిలో బ్రహ్మదేవుడి నాలుగు ముఖాల విగ్రహం ఉంది. 14వ శతాబ్దంలో కట్టిన ఈ గుడి పుష్కర్ సరస్సు దగ్గర ఉంది. సనాతన ధర్మంలో దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు.
రాక్షసుడైన వజ్రనాభుడిని బ్రహ్మదేవుడి చంపిన తర్వాత దీనిని స్థాపించారని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున ఈ ప్రాంతంలో పెద్ద జాతర జరుగుతుంది. ఇక్కడ వేల సంఖ్యలో ప్రజలు గుమికూడుతారు.
Shri Sanwaliyaji Temple
శ్రీ సాంవలియాజీ గుడి చిత్తోర్గఢ్ (Shri Sanwaliyaji Temple Chittorgarh) :
చిత్తోర్గఢ్ దగ్గరలోని మండఫియాలో ఉన్న శ్రీ సాంవలియాజీ గుడి కృష్ణ భగవానుడి శ్యామ రూపానికి అంకితం చేయబడింది. ఇక్కడికి వచ్చే భక్తులు ఆయన్ని మాధవ్ లేదా సావ్లా శ్యామ్ అని కూడా పిలుస్తారు.
ఈ గుడిని మధ్యయుగంలో కనుగొన్నారు. ఇక్కడ తవ్వకాలు జరుపుతుండగా సాంవలియాజీ విగ్రహం బయటపడింది. ఆ తర్వాత ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు. ఈ గుడి రాజస్థాన్లోని ధనిక గుళ్లలో ఒకటి. శ్రీకృష్ణ జన్మాష్టమి, కృష్ణుడికి సంబంధించిన పండుగలప్పుడు గుడికి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్ముతారు.