ఈ మురికి రైళ్లలో ఎప్పుడైనా ప్రయాణించారా? మామూలు కంపు కాదు బాబోయ్!
సాధారణంగా చాలా మంది అవసరాన్ని బట్టి రోజూ ఏదో ఒక ప్రయాణం చేస్తూనే ఉంటారు. వెళ్లే దూరాన్ని బట్టి ప్రయాణించే వాహనాన్ని ఎంపిక చేసుకుంటారు. అయితే ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకునేది మాత్రం రైలు ప్రయాణమే. ఎందుకంటే కాస్త తక్కువ ఖర్చుతో.. సేఫ్ గా వెళ్లొచ్చనేది వారి ఆలోచన. అయితే రైళ్లలో అపరిశుభ్ర వాతావరణం ప్రయాణికులను కాస్త ఇబ్బంది పెడుతున్న అంశం. అసలు మన దేశంలో అత్యంత మురికిగా ఉండే రైళ్లు ఏవో మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా వాటిలో ప్రయాణించారా?

దశాబ్ద కాలంగా భారతీయ రైల్వేలో చాలా మార్పులు జరుగుతున్నాయి. చెప్పాలంటే రైళ్ళు, స్టేషన్లు చాలా మారిపోయాయి. ఒకప్పుడు మురికిగా ఉన్నస్టేషన్లు కూడా ఇప్పుడు క్లీన్ గా, నీట్ గా తయారయ్యాయి. అయితే, కొన్ని రైళ్ళలో మాత్రం ఇప్పటికీ ప్రాథమిక పరిశుభ్రత ప్రమాణాలను పాటించడం లేదు. అలాంటి రైళ్ళలో ప్రయాణించడం ప్రయాణికులకు చేదు అనుభవాన్ని ఇస్తుంది.
అత్యంత మురికి రైలు..
దేశంలోని అత్యంత మురికి రైళ్ళలో ఒకటి బీహార్, పంజాబ్లను కలిపే సహర్సా-అమృత్సర్ గరీబ్ రాథ్. ప్రయాణికులు తరచుగా రైలు అపరిశుభ్రంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తంచేస్తారు. ఆ ప్రయాణం చాలా భయంకరమైనదిగా వర్ణిస్తారు. రైళ్లో చెత్త పేరుకుపోవడంతో భరించలేని కంపు వస్తుందని.. మళ్ళీ ఈ ట్రైన్ లో ప్రయాణించమని ఓపెన్ గా చెబుతుంటారు.
61 కి పైగా ఫిర్యాదులు
వైష్ణో దేవి-బాంద్రా స్వరాజ్ ఎక్స్ప్రెస్ రైలుపై కూడా అపరిశుభ్రత ఆరోపణలు చాలా ఉన్నాయి. దీనిపై ఒక సంవత్సరంలో 61 కి పైగా ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఇది కూడా అంతే..
ఢిల్లీ మార్గంలో నడిచే ఆనంద్ విహార్-జోగ్బానీ సీమాంచల్ ఎక్స్ప్రెస్ అత్యంత మురికి రైలు. అందులో పేరుకుపోయిన చెత్త, దుర్వాసన గురించి ఫిర్యాదు చేయని ప్రయాణికుడు లేడు. రైల్వే అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని ప్రయాణికులు ఎప్పుడూ ఎత్తి చూపుతునే ఉంటారు.
మామూలు వాసన కాదు
ఫిరోజ్పూర్-అగర్తలా త్రిపుర సుందరి ఎక్స్ప్రెస్, అజ్మీర్-జమ్మూ దేవి పూజ ఎక్స్ప్రెస్లు కూడా అత్యంత మురికి రైళ్ళ జాబితాలో ఉన్నాయి. త్రిపుర సుందరి ఎక్స్ప్రెస్లో ప్రయాణించే ప్రయాణికులు దాని బోగీల స్థితిని భయంకరమైందిగా వర్ణిస్తున్నారు, పూజ ఎక్స్ప్రెస్లో అయితే టాయిలెట్ల నుంచి వచ్చే దుర్వాసన గురించి చెప్పలేమంటున్నారు.