తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు: అభ్యర్ధుల వేటలో పార్టీలు
తెలంగాణ రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఏడాది మార్చి మాసంలోనే ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

<p>తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ప్రధాన పార్టీలు ఇంకా ఫైనల్ చేయలేదు. </p>
తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ప్రధాన పార్టీలు ఇంకా ఫైనల్ చేయలేదు.
<p>నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.</p>
నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
<p>త్వరలోనే ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.</p>
త్వరలోనే ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
<p>హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో ఆ పార్టీ గెలవలేదు. రెండు దఫాల్లో ఈ స్థానం నుండి ఆ పార్టీ ఓటమినే మూటగట్టుకొంది. దీంతో ఈ స్థానంతో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు గాను టీఆర్ఎస్ నాయకత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది</p>
హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో ఆ పార్టీ గెలవలేదు. రెండు దఫాల్లో ఈ స్థానం నుండి ఆ పార్టీ ఓటమినే మూటగట్టుకొంది. దీంతో ఈ స్థానంతో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు గాను టీఆర్ఎస్ నాయకత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది
<p>నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డినే టీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.</p>
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డినే టీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
<p>హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇంకా అభ్యర్ధిని నిర్ణయించాల్సి ఉంది. ఈ స్థానానికి పలువురు పోటీలో ఉన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు నేతలు ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నారు.</p>
హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇంకా అభ్యర్ధిని నిర్ణయించాల్సి ఉంది. ఈ స్థానానికి పలువురు పోటీలో ఉన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు నేతలు ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నారు.
<p>నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం టీఆర్ఎస్ నాయకత్వం కమిటీని ప్రకటించింది.</p>
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం టీఆర్ఎస్ నాయకత్వం కమిటీని ప్రకటించింది.
<p>మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ మూడు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సమావేశమయ్యారు. </p>
మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ మూడు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సమావేశమయ్యారు.
<p><br />ప్రతి 50 ఓటర్లకు ఒక్క నేతను ఇంచార్జీగా టీఆర్ఎస్ నాయకత్వం నియమించింది. తమ నియోజకవర్గాల్లో పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రచార బాధ్యతలను తమ భుజాల మీద వేసుకొన్నారు.</p>
ప్రతి 50 ఓటర్లకు ఒక్క నేతను ఇంచార్జీగా టీఆర్ఎస్ నాయకత్వం నియమించింది. తమ నియోజకవర్గాల్లో పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రచార బాధ్యతలను తమ భుజాల మీద వేసుకొన్నారు.
<p>నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఆయన కూడ ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.</p>
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఆయన కూడ ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
<p>లెఫ్ట్ పార్టీలు తనకు మద్దతిస్తాయని కోదండరామ్ అభిప్రాయంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడ తనకు మద్దతిచ్చే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు.</p>
లెఫ్ట్ పార్టీలు తనకు మద్దతిస్తాయని కోదండరామ్ అభిప్రాయంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడ తనకు మద్దతిచ్చే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు.
<p>హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి పేరు దాదాపుగా ఖరారు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది</p>
హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి పేరు దాదాపుగా ఖరారు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది
<p>అయితే పార్టీ నాయకత్వం ఇంకా అధికారికంగా అభ్యర్ధులను ఫైనల్ చేయలేదు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి రాములు నాయక్ పేరు ప్రధానంగా విన్పిస్తోంది. అయితే ఈ రెండు స్థానాల నుండి ఎవరిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతోందనేది ఇంకా చర్చ సాగుతోంది.</p>
అయితే పార్టీ నాయకత్వం ఇంకా అధికారికంగా అభ్యర్ధులను ఫైనల్ చేయలేదు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి రాములు నాయక్ పేరు ప్రధానంగా విన్పిస్తోంది. అయితే ఈ రెండు స్థానాల నుండి ఎవరిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతోందనేది ఇంకా చర్చ సాగుతోంది.
<p>హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి విపక్షాలు మద్దతిచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీలో ఉన్నారు. నాగేశ్వర్ కు సీపీఎం మద్దతును ప్రకటించింది.</p>
హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి విపక్షాలు మద్దతిచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీలో ఉన్నారు. నాగేశ్వర్ కు సీపీఎం మద్దతును ప్రకటించింది.
<p>ఈ రెండు స్థానాల్లో బీజేపీ పోటీకి సిద్దమౌతోంది. హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు</p>
ఈ రెండు స్థానాల్లో బీజేపీ పోటీకి సిద్దమౌతోంది. హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు
<p>.ఇదే స్థానం నుండి రామచంద్రరావు మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు.దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ క్యాడర్ లో విశ్వాసాన్ని నింపింది.</p>
.ఇదే స్థానం నుండి రామచంద్రరావు మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు.దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ క్యాడర్ లో విశ్వాసాన్ని నింపింది.