TGSRTC : తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్ ... భారీగా తగ్గిన బస్ టికెట్ ధరలు
తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం వందలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా తెలంగాణ, ఏపీ మధ్య తిరిగే ప్రయాణికులకు టిజిఎస్ ఆర్టిసి గుడ్ న్యూస్ తెలిపింది... టికెట్ ధరలను భారీగా తగ్గించింది. ఒక్క టికెట్ పై ఎంత తగ్గించారో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
TGSRTC Reduces Ticket Prices :
TGSRTC Reduces Ticket Prices : తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ఇలా రాష్ట్రంలోని ప్రతి మహిళకు ప్రయాణభారాన్ని తగ్గించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మరికొంతమంది ప్రజలకు లబ్ది చేసే నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య రాకపోకలు సాగించేవారికి ఇకపై ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి... ఈ మేరకు టికెట్స్ పై రాయితీని ప్రకటించింది టీజిఎస్ ఆర్టిసి. ఈ ఆర్టిసి టికెట్ రేట్ల డిస్కౌంట్ నిర్ణయాన్ని తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ ఎండి విసి. సజ్జనార్ ప్రకటించారు.
TGSRTC
తగ్గిన తెలంగాణ ఆర్టిసి టికెట్ ధరలు :
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే నగరంలో తెలంగాణ ప్రజలకంటే ఎక్కువగా ఏపీ ప్రజలే ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాల కోసం నగరానికి వచ్చినవారు రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇక్కడే స్థిరపడిపోయారు. నగరంలో కూకట్ పల్లి,కెపిహెచ్బి, మియాపూర్, నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, లింగంపల్లి వంటి ప్రాంతాల్లో ఏపీ ప్రజలే ఎక్కువగా కనిపిస్తారు.
ఇలా హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాలో నివాసముండే ఏపీ ప్రజలకు టిజిఎస్ ఆర్టిసి గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ - విజయవాడ నగరాల మధ్య నడిచే తెలంగాణ ఆర్టిసి బస్సుల్లో టికెట్ ధరలు తగ్గిస్తూ టిజిఎస్ ఆర్టిసి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న టికెట్ రేట్లను దాదాపు 10 శాతం తగ్గించనున్నట్లు టిజిఎస్ ఆర్టిసి ఎండి ప్రకటించారు.
హైదరాబాద్-విజయవాడ మధ్య టిజిఎస్ ఆర్టిసి నడిపే లహరి నాన్ ఏసి స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఇప్పుడున్న టికెట్ ధరలను 10 శాతం తగ్గించారు. అలాగే రాజధాని ఏసి బస్సుల్లో టికెట్ ధరపై 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. అంటే ఈ బస్సుల్లో విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రయాణాలు సాగించేవారికి ఇకపై కాస్త ఖర్చు తగ్గుతుందన్నమాట.
TGSRTC MD Sajjannar
టిజిఎస్ ఆర్టిసి టికెట్ బుకింగ్ ప్రాసెస్ :
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణానికి ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం టిజిఎస్ ఆర్టిసి అధికారిక వెబ్ సైట్ http://tgsrtcbus.in ను సందర్శించాలి. అందులో మీరు ఎక్కడి నుండి ఎక్కడి వెళ్లాలని అనకుంటున్నారో ఆ ప్రాంతాల పేరు ఎంటర్ చేయాలి. దీంతో బస్సు సర్వీసులు, టైమింగ్, టికెట్ ఛార్జీల వివరాలు కనిపిస్తాయి.
మీరు ఏ సమయంలో, ఎలాంటి సదుపాయాలు కలిగిన బస్సులో ప్రయాణించాలనుకుంటున్నారో నిర్దారించుకోండి. ఆ బస్సులో ప్రయాణానికి నిర్దేశించిన టికెట్ చెల్లించి మీ సీటును రిజర్వ్ చేసుకొండి. ఇలా ముందుగానే మీ సీటు రిజర్వేషన్ చేసుకుని ఆ బస్సు బయలుదేరే సమయానికి చేరుకుంటే సరిపోతుంది.
విజయవాడ - హైదరాబాద్ మధ్య కూడా టిజిఎస్ ఆర్టిసి చాలా బస్సు సర్వీసులను నడిపిస్తోంది. అందులో కేవలం లహరి, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సుల్లో మాత్రమే టికెట్ ధరపై డిస్కౌంట్ ప్రకటించారు... మిగతా బస్సులు యధావిధిగా చార్జీలు వర్తిసాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలి. ఈ బస్సుల్లో ప్రయాణించి డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని టిజిఎస్ ఆర్టిసి కోరుతోంది.