- Home
- Telangana
- Telangana Electricity Tariff Hike : తెలంగాణలో కరెంట్ బిల్లులు పెరుగుతాయా? ఇక వాచిపోవడం ఖాయమేనాా?
Telangana Electricity Tariff Hike : తెలంగాణలో కరెంట్ బిల్లులు పెరుగుతాయా? ఇక వాచిపోవడం ఖాయమేనాా?
Power Tariff Hike in Hyderabad : తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటి నిర్మాణాన్ని బట్టి బిల్లు వసూలుకు టిజిఎస్పిడిసిఎల్ సిద్దమయ్యిందట...దీంతో బిల్లులు ఏ స్థాయిలో పెరగనున్నాయో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Power Tariff Hike in Hyderabad
Current Charges : తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నిబంధనల పేరిట ప్రజల నుండి భారీగా విద్యుత్ ఛార్జీల వసూలుకు సిద్దమైనట్లు సమాచారం. ఇకపై ఇంటి అనుమతులను బట్టి బిల్లులు వసూలు చేసే ఆలోచనలో సర్కార్ వుందట. అన్ని అనుమతులతో కూడిన ఇండ్లకు ఇప్పుడున్న ఛార్జీలే వర్తించగా అనుమతులు లేని ఇళ్ళకు మాత్రం అధిక బిల్లులు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో నూతన విద్యుత్ నిబంధనలు అమలయితే ప్రజలపై భారీ భారం పడనుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు కరెంట్ బిల్లు వాచిపోనుంది. అనుమతులు లేని ఇళ్లకు విద్యుత్ ఛార్జీలు డబుల్, ట్రిపుల్ కానున్నాయి... అంటే ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతం అవుతున్న నగరవాసుల జేబుకు మరో చిల్లు పడనుందన్నమాట.
Power Tariff Hike in Telangana
కరెంట్ బిల్లులు ఏ స్థాయిలో పెరుగుతాయో తెలుసా?
ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ శాఖ గృహ వినియోగదారులకు డొమెస్టిక్ కేటగిరి కింద కరెంట్ బిల్లు వసూలు చేస్తోంది. అంటే ఈ కేటగిరీ కింద చాలా తక్కువ ధరకే విద్యుత్ అందిస్తుంది. వాణిజ్య, పరిశ్రమలు వంటి విభాగాలకు అధిక చార్జీలు వసూలు చేస్తుంది.
అయితే తాజాగా డొమెస్టిక్ వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు తెలంగాణ విద్యుత్ శాఖ సిద్దమైందట. నిబంధనల పేరిట టిజిఎస్పిడిసిఎల్ విద్యుత్ బిల్లులు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అన్ని గృహాలకు డొమెస్టిక్ కేటగిరీ కింద విద్యుత్ బిల్లులు వసూలు చేసేవారు... కానీ ఇకపై ఈ రూల్స్ చేంజ్ చేయనుందట టిజిఎస్పిడిసిఎల్.
కేవలం ప్రభుత్వ అనుమతులు కలిగిన ఇళ్ళనే ఈ డొమెస్టిక్ కేటగిరీ కింద పరిగణించనున్నారు... అనుమతులు లేని ఇళ్ళను టెంపరరీ కేటగిరీగా పరిగణించనున్నారట. అంటే అనుమతులు లేని ఇళ్లకు డొమెస్టిక్ కేటగిరీ వర్తించదన్నమాట. దీంతో ఆ ఇళ్లకు అత్యధిక బిల్లులు వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణలో చాలామందికి విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ వాసులపై ఈ ప్రభావం ఎక్కువగా వుండనుంది. ఒక్క నగరంలోనే దాదాపు 10 లక్షల మందిపై విద్యుత్ భారం పెరగనున్నట్లు తెలుస్తోంది. బహుళ అంతస్తుల భవనాల్లో కొన్నింటికే అనుమతులు వుంటాయి... మిగతావాటిని అనుమతులు లేకుండానే నిర్మిస్తుంటారు. ఇలాంటి ఇళ్లపై విద్యుత్ భారం పెరగనుంది. ఇప్పుడు వస్తున్న బిల్లుకు డబుల్, ట్రిపుల్ బిల్లు వస్తుందన్నమాట.
Power Tariff Hike in Telangana
అనుమతులుంటే ఎంత, అనుమతులు లేకుంటే ఎంత బిల్లు...
డొమెస్టిక్ కేటగిరీ కింద ప్రస్తుతం 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగానికి రూ.2000 లోపు బిల్లు వస్తుంది. యూనిట్ కు కేవలం రూ.5 నుండి రూ.7 మాత్రమే వసూలు చేస్తారు. అందుకే తక్కువ బిల్లు వస్తుంది.
ఇక అనుమతులు లేని ఇళ్లను స్పెషల్ కేటగిరీ కింద పరిగణిస్తే యూనిట్ కు రూ.11 వరకు వసూలు చేస్తారు. అంటే ఇప్పుడు వసూలుచేస్తున్న బిల్లును డబుల్ చేస్తారన్నమాట. దీంతో గతంలో 300 యూనిట్లలోపు వచ్చిన విద్యుత్ బిల్లు రూ.4000 కు చేరుకుంటుంది. ఇలా వినియోగదారులకు విద్యుత్ ఛార్జీల బారం పెరుగుతుంది.
ఒక్క హైదరాబాద్ లోనే అనుమతులు లేకుండా ఇళ్లు 10 లక్షలవరకు వుంటాయని అంచనా. అంటే వీరందరి కరెంట్ బిల్లు డబుల్ కానుందన్నమాట. ఇలా నిబంధనలపేరిట కరెంట్ బిల్లులు పెంచితే ప్రజాగ్రహం పెల్లుబికే అవకాశం వుంది. అయితే ఈ బిల్లుల పెంపు నిర్ణయం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి వున్నట్లు సమాచారం. అనుమతి లభిస్తే మాత్రం కరెంట్ బిల్లు వాచిపోనుంది.