మున్సిపోల్స్పై గులాబీ బాస్లో గుబులు... కారణం ఇదేనా..?
ఎనిమిది నెలలో క్రితం తెలంగాణలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిలో నాటి స్పీడు ఇప్పుడు లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో అనుకుంటే ఇంకేదో జరగడంతో గులాబీ శ్రేణులు కాస్త కలవరపాటుకు గురైయ్యాయి.
ఎనిమిది నెలలో క్రితం తెలంగాణలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిలో నాటి స్పీడు ఇప్పుడు లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో అనుకుంటే ఇంకేదో జరగడంతో గులాబీ శ్రేణులు కాస్త కలవరపాటుకు గురైయ్యాయి. ఆ నష్టాన్ని స్థానిక ఎన్నికల్లో పూడ్చుకున్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల నాటి జోరు మాత్రం కనిపించడం లేదనే తెలుస్తోంది.
నియోజకవర్గాల్లోని కార్యకర్తల్లో తిరిగి జోష్ నింపేందుకు మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని పలువురు నేతల నుంచి కేసీఆర్కు ఒత్తిడి వస్తోంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో పరిస్ధితులు టీఆర్ఎస్కు అనుకూలంగా లేవని ముఖ్యమంత్రికి నివేదికలు అందుతున్నారు. రాష్ట్రంలోని 132 మున్సిపాలిటీలు, ఆరు నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఆయా ప్రాంతాల్లో టీఆర్ఎస్కు అనుకూలత, ప్రతికూలతలపై టీఆర్ఎస్ అగ్రనాయకత్వం సర్వే చేయింగా.. ఉత్తర తెలంగాణలో కారుకు కష్టమేనన్న సూచనలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో అక్కడ కింది స్థాయి నుంచి ఎదిగేందుకు కమలనాథులు మున్సిపల్ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు.
నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానిస్తానని ఆ మధ్య కేసీఆర్ అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పే గైర్హాజరయ్యారు. అదే సమయంలో మోడీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి తాను వెళ్లకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తన కుమారుడు కేటీ రామారావును పంపించారు. మొత్తం మీద, మోడీని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించే ఉద్దేశం కేసీఆర్ కు లేదని అర్థమవుతోంది.