MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Telangana
  • చినజీయర్‌స్వామి ఆశ్రమానికి కేసీఆర్.. యాదాద్రి ఆలయ ప్రారంభం, శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలపై చర్చ (ఫోటోలు)

చినజీయర్‌స్వామి ఆశ్రమానికి కేసీఆర్.. యాదాద్రి ఆలయ ప్రారంభం, శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలపై చర్చ (ఫోటోలు)

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పున:ప్రారంభంపై చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు  సీఎం కేసీఆర్ చర్చించారు

1 Min read
Author : Siva Kodati
Published : Jan 09 2022, 09:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
kcr

kcr

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పున:ప్రారంభంపై చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు  సీఎం కేసీఆర్ చర్చించారు. మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
kcr

kcr

ఈ నేపథ్యంలోనే ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని ఆదివారం కేసీఆర్ సందర్శించారు. ఆ ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై చినజీయర్‌ స్వామితో ముఖ్యమంత్రి చర్చించారు. చినజీయర్ స్వామి ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం మార్చి 28న గర్భాలయంలోని స్వయంభువుల నిజదర్శనాలను భక్తులకు కల్పించనున్నారు.
 

37
kcr

kcr

ఫిబ్రవరిలో జీయర్‌ ఆశ్రమంలో జరిగే సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లను కేసీఆర్ పరిశీలించారు. చినజీయర్ స్వామితో కలిసి యాగశాలను సందర్శించారు. సీఎంతో పాటు మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌, మైం హోం గ్రూప్స్ అధినేత రామేశ్వరరావు ఉన్నారు.

47
kcr

kcr

ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలను ఆశ్రమంలో నిర్వహిస్తున్నారు. ఆ ఏర్పాట్లను స్వయంగా కేసీఆర్‌కు చినజీయర్ స్వామి వివరించారు. యాగ సమయంలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను సీఎం ఆదేశించారు. 

57
kcr

kcr

మిషన్‌ భగరీథ నీరు అందించాలని అధికారులకు సూచించారు. యాగానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. యాగశాల వద్ద ఫైర్‌ ఇంజన్లు ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. 

67
kcr

kcr

యాగానికి వీఐపీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు చేశారు.

77
kcr

kcr

ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో వైభవంగా జరగబోతున్నాయి. సహస్రాబ్ది వేడుకల కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇప్పటికే ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert: అల్ప‌పీడ‌న ప్ర‌భావం.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు ఖాయం
Recommended image2
Kavitha: ఈసారి కేటీఆర్‌కు క‌విత రాఖీ క‌డ‌తారా లేదా.? అన్న‌పై చెల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
50 అంత‌స్తుల్లో అద్భుత నిర్మాణం.. ఒక్కో ఫ్లాట్ ధ‌ర ఏకంగా రూ. 2 కోట్లు, ఎక్క‌డంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved