MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • తెలంగాణలో 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఆరుగురు మృతి.. పలువురిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది..

తెలంగాణలో 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఆరుగురు మృతి.. పలువురిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది..

తెలంగాణ వ్యాప్తంగా గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆరుగురు చనిపోయారు. వరద నీటిలో చిక్కుకున్న ఎంతోమందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Jul 28 2023, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

హైదరాబాద్/వరంగల్: రాష్ట్రంలో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వర్షాలకు సంబంధించిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. సిరిసిల్లలో నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఓ గర్భిణి, పెద్దపల్లి జిల్లాలో 19 మంది కార్మికులను రెస్క్యూ టీం రక్షించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

హనుమకొండ దర్జీ వీధికి చెందిన బి ప్రేమ్ సాగర్ గురువారం ఉదయం పాలు కొనడానికి వెడుతూ.. కిందపడ్డ కరెంట్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు ఇన్‌స్పెక్టర్ ఎన్ కరుణాకర్ తెలిపారు. వర్షానికి తడిసిన రోడ్డుపై విద్యుత్ తీగ తెగిపడడంతో ఈ విషాదం జరిగింది. 

311
telangana rains

telangana rains

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు పి యాకయ్య, పి శ్రీనివాస్ వాగులో గల్లంతయ్యారు. నీటి మట్టం పెరగడంతో వారు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయి కొట్టుకుపోయారు. సిఆర్‌పిసి సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసినట్లు పెద్దవంగర సబ్ ఇన్‌స్పెక్టర్ పి రాజు తెలిపారు.

411

హనుమకొండ పట్టణంలోని గోపాలపూర్ ప్రాంతానికి చెందిన జి రాజు (40) వరద నీటిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించలేదు.

511

పొంగిపొర్లుతున్న కొండాయి వాగులో 10 మంది కొట్టుకుపోయారనే పుకార్లు కూడా వ్యాపించాయి. హైదరాబాద్‌లోని మీరాలం ట్యాంక్‌లో గురువారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వరద నీటిలో గల్లంతై, కొట్టుకువచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

611

అయితే, దీన్ని ఏటూరునాగారం పోలీసులు ఖండించారు. ప్రవాహంలో గల్లంతైన ఇద్దరు వ్యక్తులు చెట్ల కొమ్మల సాయంతో ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు.

711

పెద్దపల్లి జిల్లాలో సబితం జలపాతంలో జారిపడి కరీంనగర్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఎం వెంకటేష్ అనే యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి జలపాతాల దగ్గరకు వెళ్లాడు. వెంకటేష్ నీటిలో మునిగిపోతుండగా స్థానికులు అతని స్నేహితులను రక్షించారు. బుధవారం రాత్రి అతని మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.

811

మరో ఉదంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలో బుధవారం గ్రామస్థులతో కలిసి వాగు దాటేందుకు ప్రయత్నించిన 56 ఏళ్ల మహిళ కొట్టుకుపోయింది. ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో కె.సావిత్రి కొట్టుకుపోయింది.

911

వైరల్ అయిన ఒక వీడియోలో, కొంతమంది మహిళలు ప్రవాహాన్ని దాటడానికి  పొడవైన తాడు కావాలంటూ సహాయం కోసం అరవడం వినిపించింది, అయితే దీనిని ఏర్పాటు చేసేలోగానే.. మిగతావారు నిస్సహాయంగా చూస్తుండగానే సావిత్రి కొట్టుకుపోయింది.

1011
Telangana

Telangana

కాగా, పలు జిల్లాల్లో వరద నీటిలో చిక్కుకున్న వందలాది మందిని ఎన్‌డిఆర్‌ఎఫ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు, రెవెన్యూ అధికారులు, నిపుణులైన ఈతగాళ్లతో సహా వివిధ ఏజెన్సీలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

1111

పెద్దపల్లిలో ఇసుక క్వారీలో చిక్కుకుపోయిన 19 మంది కూలీలు బయటపడ్డారు. మంథని మండలం గోపాల్‌పూర్‌లోని మానేరు వాగు క్వారీలో ఇరుక్కుపోయారు.జగిత్యాల జిల్లాలోని ఆరు మండలాల్లోని 30 గ్రామాలకు చెందిన 300 మందిని సహాయక బృందాలు సహాయక శిబిరాలకు తరలించారు.

About the Author

BS
Bukka Sumabala
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
Recommended image2
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం
Recommended image3
Now Playing
దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved