MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • రైతు భరోసా డబ్బులు రాలేదా..? అయినా పర్లేదు..టెన్షన్ పడొద్దు..ఇలా చేయండి చాలు!

రైతు భరోసా డబ్బులు రాలేదా..? అయినా పర్లేదు..టెన్షన్ పడొద్దు..ఇలా చేయండి చాలు!

రైతు భరోసా నిధులుగా మొదటి దశలో 2,349 కోట్లు జమ. మిగిలిన అర్హులందరికీ రానున్న 9 రోజుల్లో డబ్బులు అందనున్నట్లు మంత్రి తుమ్మల తెలియజేశారు.

2 Min read
Bhavana Thota
Published : Jun 17 2025, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రైతు భరోసా
Image Credit : social

రైతు భరోసా

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలలో భాగంగా 'రైతు భరోసా' నిధులను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (జూన్ 16) విడుదల చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో ఈ నిధుల విడుదల జరిగింది. అదేరోజు పలువురు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయినప్పటికీ, కొందరికి నిధులు రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది.

26
తొలి రోజు కేవలం 2 ఎకరాల లోపు
Image Credit : iSTOCK

తొలి రోజు కేవలం 2 ఎకరాల లోపు

ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, తొలి రోజు కేవలం 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే నిధులు జమ చేశామని చెప్పారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున ఈ సాయం అందించినట్లు తెలిపారు.

Related Articles

Related image1
Telangana Rains : తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్ ... జూన్ సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు
Related image2
Telangana: ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. డీఏ పెంచుతూ నిర్ణ‌యం
36
మొత్తం విడుదలైన నిధులు
Image Credit : iSTOCK

మొత్తం విడుదలైన నిధులు

రైతుల సంఖ్య: 41.25 లక్షలు,సాగుబడి భూమి: 39.16 లక్షల ఎకరాలు,నిధుల మొత్తం: ₹2,349.83 కోట్లు

46
మిగిలిన రైతులకు మంత్రి హామీ
Image Credit : Asianet News

మిగిలిన రైతులకు మంత్రి హామీ

తొలి విడతలో డబ్బులు రాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మిగిలిన అర్హులందరికీ రానున్న 9 రోజుల్లో 'రైతు భరోసా' నిధులు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఎవరైనా ఈ నిధులు పొందలేకపోతే, స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.

56
దండగ కాదు, పండుగ
Image Credit : Freepik

దండగ కాదు, పండుగ

 రైతు సంక్షేమం కోసం గత 18 నెలల్లో రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి  తెలిపారు. ఇందులో రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మద్దతు ధర, బోనస్ చెల్లింపు, రైతు బీమా వంటి పథకాలు ఉన్నాయి. ఇంకా మాట్లాడుతూ, “వ్యవసాయం దండగ కాదు, పండుగగా మారాలన్నదే మా సంకల్పం” అని చెప్పారు. వాణిజ్య పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, రైతులకు అవసరమైన పనిముట్లు, సౌకర్యాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

66
సోలార్ విద్యుత్ ప్రణాళికలు
Image Credit : our own

సోలార్ విద్యుత్ ప్రణాళికలు

: ప్రస్తుతం ఉచిత విద్యుత్‌కు ఏటా రూ.17 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, దీన్ని సోలార్ విద్యుత్‌తో భద్రపరిస్తే, అది ఉచితం మాత్రమే కాకుండా, అదనపు ఆదాయం కూడా తెస్తుందని తెలిపారు. ఒక్కో కుటుంబానికి నెలకు రూ.2,000–3,000 అదనంగా వచ్చేలా సోలార్ పంపు సెట్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved