18 మంది మహిళల హత్య: ఖైదీలకు సైకో కిల్లర్ రాములు పాఠాలు
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మహిళలను హత్య చేసిన కేసులో రాములు కీలక పాత్ర పోషించాడు. గత నెలలో రాములు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పోలీసుల విచారణలో రాములు పలు ఆసక్తికర విషయాలను చెప్పాడు.
వరుసగా ఒంటరి మహిళలను హత్య చేసిన సైకో కిల్లర్ రాములు జైల్లో ఖైదీలకు గురువుగా మారాడు. హత్యలు చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో సహచర ఖైదీలకు వివరించారు. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెలుగు చూశాయి.
పెళ్లైన కొద్దినెలలకే భార్య మరొకరితో వెళ్లిపోవడంతో ఆడవాళ్లపై కక్ష పెంచుకొన్నాడు సైకో కిల్లర్ రాములు.
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన రాములు మహిళలపై దారుణాలకు పాల్పడ్డాడు. 18 ఏళ్లలో 18 మంది మహిళలను అత్యంత దారుణంగా హత్య చేశాడు.
21 ఏళ్ల వయస్సులోనే రాములుకు పెళ్లైంది. పెళ్లైన కొద్ది నెలలకే భార్య వేరే వ్యక్తితో పారిపోయింది. దీంతో రాములు మహిళలపై కక్ష పెంచుకొన్నాడు.
2003 నుండి ఇప్పటివరకు ఉమ్మడి మెదక్, రాచకొండ, సైబరాబాద్, హైద్రాబాబద్ కమిషనరేట్ల పరిధిలో 18 మంది మహిళలను హత్య చేశాడు.
గత ఏడాది ఘట్కేసర్ వద్ద అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందింది. రాములే ఆమెను హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
. నిందితుడిని పోలీసులు గత నెల 26న అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పోలీసుల కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. పోలీసుల కస్టడీలో రాములు పలు సంచలన విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది.
జైలులో సహచర ఖైదీలకు రాములు గురువుగా వ్యవహరించాడు. హత్యలు లేదా ఇతర ఘటనలకు పాల్పడిన సమయంలో ఏ రకంగా పోలీసుల నుండి తప్పించుకోవచ్చో పూసగుచ్చినట్టుగా వివరించేవాడని పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడని సమాచారం.
జైలు నుండి ఎలా తప్పించుకోవాలి, హత్యలు ఎలా చేయాలనే విషయాలపై రాములు పలువురికి పక్కా ప్లాన్ లతో వివరించినట్టుగా విచారణలో ఒప్పుకొన్నాడు.
రాములును చీకటి గదిలో బంధించినా కూడ అతనిలో మార్పు రాలేదు. చివరికి అతడిని వరంగల్ జైలుకు తరలించారు. ఓ హత్యకు ప్రణాళిక కూడా గీసి ఇచ్చారు.రాములు ఇచ్చిన ప్లాన్ తోనే ఓ నిందితుడు జైలు నుండి తప్పించుకొన్నాడు.
ఆ తర్వాత మరో నేరం చేస్తూ అతను పోలీసులకు చిక్కాడు. అతడిని విచారించే సమయంలో రాములు గురించి పోలీసులకు వివరించాడు.
కల్లు దుకాణానికి వచ్చే మహిళను రాములు లక్ష్యంగా చేసుకొనేవాడు. లైంగిక కోరికలు తీరిస్తే రూ. 1000 నుండి రూ. 1500 ఇస్తానని నమ్మిస్తాడు
లైంగిక కోరికలు తీర్చుకొనేందుకు గాను నిందితుడు నిర్మానుష్య ప్రదేశాలకు మహిళలను తీసుకెళ్లేవాడు. అక్కడ వారితో లైంగిక కోర్కెలను తీర్చుకొనేవాడు. ఆ తర్వాత తనతో తెచ్చుకొన్న వారిని హత్య చేసేవాడు. తనతో తెచ్చుకొన్న మద్యాన్ని ముఖంపై పోసి గుర్తుపట్టకుండా దగ్దం చేసేవాడు. ఈ విషయాన్ని నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడని తెలుస్తోంది.
గతంలో తాను చేసిన హత్యలతో పాటు పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకొన్నాడో కూడ రాములు సహచర ఖైదీలకు వివరించేవాడు. రాములు చంపిన నలుగురు మహిళల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని పోలీసులు చెబుతున్నారు.