ఈ దొంగ రూటే సపరేటు.. దొంగతనానికీ టైమింగ్స్.. 12 ఏళ్లలో 70 ఇళ్లు గుల్ల..
డెబ్బై ఇండ్లలో దొంగతనం చేసిన ఓ ఘరానా దొంగను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పన్నెండేళ్లలో 70 ఇండ్లు దొంగతనం చేసిన ఇతనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటినే ఫాలో అవుతుంటాడు.
డెబ్బై ఇండ్లలో దొంగతనం చేసిన ఓ ఘరానా దొంగను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పన్నెండేళ్లలో 70 ఇండ్లు దొంగతనం చేసిన ఇతనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటినే ఫాలో అవుతుంటాడు.
టిప్టాప్ గా తయారై, ప్యాంట్ జేబులో టెస్టర్, కటింగ్ ప్లేయర్ తో బైక్పై బయల్దేరుతాడు. ఖరీదైన కాలనీల్లో తిరుగుతూ, తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తాడు. అపార్టుమెంట్స్ లోకి వెళ్లి లిఫ్ట్లో రెండు మూడు సార్లు కిందకు మీదకు తిరుగుతాడు. తాళం వేసిన ఫ్లాట్స్ను గుర్తిస్తాడు. ఎవరైనా అడిగితే ఎలక్ట్రీషియన్ని అని, కరెంట్ పని చేయడానికి వచ్చానని చెబుతాడు.
ఇంకో విషయం ఏంటంటే ఈ దొంగగారు పగటిపూట మాత్రమే దొంగతనం చేస్తాడు. వెండి అస్సలు ముట్టడు, బంగారం, నగదే ఇతని టార్గెట్. ఒకింట్లో అనుకున్నంత దొరక్కపోతే మరో ఇంటికి వెడతాడు. అతని జాబ్ టైమింగ్స్ 10 టు 5 అంతే. నైట్ అంతా లగ్జరీ హోటల్ లో చిల్ అవుతాడు. ముంబై, గోవాలకు విమానాల్లో వెళ్లి జల్సాలు చేస్తాడు.
ఇలా 12 ఏళ్లుగా పట్టపగలే 70 ఇళ్లను గుల్ల చేశాడీ పగటి దొంగ. సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు. అతని వద్ద నుంచి 1.40 కేజీల బంగారం, రూ.40వేల నగదు, 4 బైక్లు సహా మొత్తం రూ.52 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
గచ్చిబౌలిలోని కమిషనరేట్లో సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకీకి చెందిన 28 ఏళ్ల మిర్ ఖాజమ్ ఆలీ అలియాస్ ఖాజు అలియాస్ సూర్య పదోతరగతి వరకు చదువుకున్నాడు. చిన్నప్పుడు తండ్రితో పాటు ఫంక్షన్ హాల్లో పనిచేసేవాడు. చిన్నప్పటినుండే జల్సాలకు అలవాటు పడ్డాడు. డబ్బుకోసం చిన్న చిన్న చోరీలు చేసేవాడు.
క్రమంగా ఆ తర్వాత 2008 నుంచి చోరీలనే వృత్తిగా ఎంచుకున్నాడు. అలా 12 ఏళ్లుగా చోరీలు చేసిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడపుతున్నాడు. ఇప్పటి వరకు 70 దొంగతనాలు చేసినట్లు సీపీ వెల్లడించారు.
మరి ఎప్పుడూ పోలీసులకు దొరకలేదా అంటే మూడు సార్లు దొరికాడు. జైలుకూ వెళ్లి వచ్చాడు. జైలునుండి విడుదలయ్యాక ఎంచక్కా మూడు, నాలుగు నెలలు రిలాక్స్ అవుతాడు. ఆ తరువాత మళ్లీ పనిలోకి దిగి.. ఇళ్లు చక్కబెడతారు.
ఇప్పటికి ఇలా 2015లో జూబ్లీహిల్స్, 2016 మీర్పేట, 2018లో సంగారెడ్డి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతనిపై మూడు సార్లు పీడీ యాక్టు నమోదైంది. అయినా చోరీలు చేయడం మానలేదు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలు నుంచి బయటకు వచ్చిన ఖాజమ్ ఆగస్టు వరకు రిలాక్స్ ఆయ్యాడు. ఆ తర్వాత రంగంలోకి దిగి వరుస చోరీలకు పాల్పడ్డాడు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, మహబూబ్నగర్లో కలిపి మొత్తం 16 దొంగతనాలు చేశాడు.
సైబరాబాద్లో వరుస దొంగతనాలు జరుగుతుండడం, నార్సింగిలో ఇటీవల ఒక చోరీ జరగడంతో సీపీ సజ్జనార్ ప్రత్యేక దృష్టి సారించారు. శంషాబాద్ ఎస్వోటీ, సీసీఎస్ పోలీసులను రంగంలోకి దింపారు.
మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఎస్వోటీ అదనపు డీసీపీ సందీప్, ఏసీపీ రఘునందన్రావు పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ కనకయ్య, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, నార్సింగి డీఐ బాలరాజ్లు తమ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశారు. ఘరానా దొంగ ఆటకట్టించిన పోలీస్ సిబ్బందిని సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.