MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • పాశమైలారం ప్రమాదం విషయంలో సీఎం Revanth Reddy కీలక నిర్ణయం.. బాధిత కుటుంబాలకు భారీగా నష్ట పరిహారం.

పాశమైలారం ప్రమాదం విషయంలో సీఎం Revanth Reddy కీలక నిర్ణయం.. బాధిత కుటుంబాలకు భారీగా నష్ట పరిహారం.

పాశమైలారం పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

2 Min read
Author : Bhavana Thota
| Updated : Jul 01 2025, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఒక్కొక్కరికి రూ.1 కోటి
Image Credit : ANI

ఒక్కొక్కరికి రూ.1 కోటి

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యక్షంగా స్పందిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున పరిహారం అందేలా చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం సంబంధిత కంపెనీ యాజమాన్యంతో మాట్లాడాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. అధికార యంత్రాంగం ఈ విషయంలో బాధిత కుటుంబాలకు సంపూర్ణ మద్దతుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
 వైద్య సేవలు ఉచితంగా
Image Credit : ANI

వైద్య సేవలు ఉచితంగా

ఈ ఘటనలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వ వైద్య సేవలు ఉచితంగా అందించనున్నట్టు సీఎం తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ప్రత్యేక వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని, ఆరోగ్య విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులకు ఆయన సూచించారు.ప్రమాదానికి కారణమైన వారు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసినవారిని గుర్తించేందుకు దర్యాప్తు వేగంగా సాగుతుందని వెల్లడించారు. పరిశ్రమల నిర్వహణలో ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యతను పాటించకపోతే, ప్రాణ నష్టం జరగడం లాంటివి తలెత్తుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

36
పాశమైలారం ప్రమాదం
Image Credit : X/Screengrab

పాశమైలారం ప్రమాదం

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. వారికి ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, ప్రభుత్వ మద్దతు కూడా అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కార్మికుడి ప్రాణం అమూల్యమని, వారి భద్రతకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.పాశమైలారం ప్రమాదం నేపథ్యంలో, పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై ప్రభుత్వం సమీక్షకు ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమలు సురక్షితంగా నిర్వహించడంపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమలపై ఆడిట్ చేపట్టాలని, అవసరమైతే నిబంధనలు కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

46
అర్జంటుగా చికిత్స
Image Credit : unsplash

అర్జంటుగా చికిత్స

ఇదిలా ఉండగా, పేలుడులో గాయపడిన వారికి అర్జంటుగా చికిత్స అందించేందుకు ప్రభుత్వం మెడికల్ టీంలను ఏర్పాటు చేసింది. సాంకేతిక నిపుణులు, డాక్టర్లు కలిసి పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన మెడికల్ సపోర్ట్ అందిస్తున్నారు.ఈ ఘటనపై రాజకీయ నేతలు, కార్మిక సంఘాలు తీవ్ర స్పందన వ్యక్తం చేశాయి. ప్రమాదం చోటుచేసుకున్న దగ్గరికి వెళ్లి పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రభుత్వం తక్షణ స్పందనపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.పాశమైలారం వంటి పరిశ్రమలపరమైన ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం రాష్ట్రానికి ఉందని పరిశ్రమల శాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వ భద్రతా మార్గదర్శకాలను అనుసరించకుండా పరిశ్రమలు నడుస్తున్నాయని ఇప్పటికే కొన్ని నివేదికలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుంటోంది.

56
బాధితులకు అండగా
Image Credit : stockphoto

బాధితులకు అండగా

బాధితులకు ప్రభుత్వం తరుఫున అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ఇలాంటి ప్రమాదం తెలంగాణలో ఇప్పటివరకు జరగలేదు. సిగాచి ప్రమాదం దురదృష్టకరం.. ఇది అత్యంత విషాద ఘటన. అన్ని శాఖలు సమన్వయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశిస్తున్నాం. గాయపడి పనిచేయని స్థితిలో ఉన్న బాధితులకు రూ.10 లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు.

66
పరిశ్రమలో 143 మంది
Image Credit : Telangana CMO @ X

పరిశ్రమలో 143 మంది

దుర్ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో 143 మంది ఉన్నారు. ప్రమాదంపై అత్యున్నత కమిటీతో విచారణ జరిపిస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. మృతులు, గాయపడిన వారి పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం మా దగ్గర ఉంది. విచారణ జరిగి నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad Groundwater : హైదరాబాద్‌లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్న టాప్ 5 ప్రాంతాలివే..
Recommended image2
విమోచనం కాదు విలీనం కాదు... సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవమే ఎందుకో తెలుసా? : సీఎం రేవంత్ రెడ్డి
Recommended image3
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Related Stories
Recommended image1
Telangana: త‌ల్లిదండ్రుల ఖాతాల్లోకి పిల్ల‌ల 15 శాతం జీతం... సీఎం రేవంత్ సంచ‌ల‌న నిర్ణ‌యం.
Recommended image2
Telangana Rain Alert : జూలై వస్తూనే జోరువానలు తెచ్చింది... ఈ తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షాలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved