సోదరుడికి రాఖీ కట్టి మురిసిపోయిన మంత్రి సబితమ్మ...
తెలగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాఖీ పండగను సోదరుడు నరసింహారెడ్డి ఇంట జరుపుకున్నారు.
Sabitha Indrareddy
హైదరాబాద్ : సోదర సోదరీమనుల ప్రేమానురాగాలతో జరుపుకునే పండగ రాఖీ పౌర్ణమి. తమ సోదరులకు రాఖీ కట్టి ఆడపడుచులు మురిసిపోతుంటే... వారి ఆశీర్వాదం తీసుకుని సోదరులు ఆనందపడుతుంటారు. ఇలా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా తన సోదరుడికి రాఖీ కట్టి ప్రేమను చాటారు.
Sabitha Indrareddy
రక్షా బంధన్ సందర్భంగా ఇవాళ ఉదయమే తమ్ముడు నరసింహా రెడ్డి ఇంటికి రాఖీలు, స్వీట్ బాక్స్ తో చేరుకున్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితమ్మ. తన సోదరుడికి రాఖీ కట్టి, స్వీట్ తినిపించారు. నరసింహా రెడ్డి తన సోదరి ఆశీర్వాదం తీసుకున్నాడు.
Sabitha Indrareddy
రక్షా బంధన్ సందర్భంగా ఇవాళ ఉదయమే తమ్ముడు నరసింహా రెడ్డి ఇంటికి రాఖీలు, స్వీట్ బాక్స్ తో చేరుకున్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితమ్మ. తన సోదరుడికి రాఖీ కట్టి, స్వీట్ తినిపించారు. నరసింహా రెడ్డి తన సోదరి ఆశీర్వాదం తీసుకున్నాడు.
Sabitha Indrareddy
ఈ సందర్భంగా ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సబిత. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, ఆప్యాయతలకు రక్షాబంధన్ నిదర్శనమని అన్నారు. ఆడపడుచులకు అన్నదమ్ములు ఎప్పుడు రక్షణగా వుంటారని గుర్తుచేసే పండగ ఇదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.