హోంశాఖ: అప్పుడు విద్యాసాగర్ రావు, ఇప్పుడు కిషన్ రెడ్డి
నాడు చెన్నమనేని విద్యాసాగర్ రావుకు, నేడు కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ, రాష్ట్ర విభజన సమయంలో కూడ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా నుండి బీజేపీని బలోపేతం చేయడంలో చెన్నమనేని విద్యాసాగర్ రావు కీలక పాత్ర పోషించారు.1998,1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా కరీంనగర్ ఎంపీ స్థానం నుండి చెన్నమనేని విద్యాసాగర్ రావు పోటీ చేసి విజయం సాధించారు.
1999 ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది.వాజ్పేయ్ ఆనాడు ప్రధాన మంత్రిగా ఉన్నారు.వాజ్పేయ్ కేబినెట్లో చెన్నమనేని విద్యాసాగర్ రావుకు చోటు దక్కింది.వాజ్పేయ్ కేబినెట్లో విద్యాసాగర్ రావుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది.
వాజ్ పేయ్ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించిన తర్వాత విద్యాసాగర్ రావుకు హోం శాఖ నుండి వాణిజ్య, పరిశ్రమల శాఖ కేటాయించింది. విద్యాసాగర్ రావు తర్వాత ప్రస్తుతం తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి అదే పదవి దక్కింది.
2014 జూన్ రెండో తేదీన ఉమ్మడి ఏపీ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డి విజయం సాధించారు. ఎంపీగా విజయం సాధించిన తొలి సారే కిషన్ రెడ్డికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిత్వశాఖ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ తెలంగాణకే దక్కింది. 1999లో కూడ విద్యాసాగర్ రావు కరీంనగర్ నుండి విజయం సాధించారు.
1980లో కరీంనగర్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసిన విద్యాసాగర్ రావు ఓటమి పాలయ్యాడు.1998, 1999 ఎన్నికల్లో మాత్రం విద్యాసాగర్ రావు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత విద్యాసాగర్ రావును మహారాష్ట్ర గవర్నర్ గా నియమించారు.