ఆరు సర్వేల్లో టీఆర్ఎస్కి అనుకూలం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ దళానికి బూస్ట్
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ కేంద్రీకరించింది. ఈ ఎన్నికల్లో రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని గులాబీ దళపతి ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అంతర్గతంగా సర్వేలు నిర్వహించారు.
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీకి మరింత ఊపునిస్తున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరు ప్రైవేట్ ఏజెన్సీలతో కేసీఆర్ సర్వే నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుండి 28వ తేదీ వరకు ఈ సర్వేలు నిర్వహించారు.
వరంగల్, నల్గొండ, ఖమ్మంతో పాటు హైద్రాబాద్ ,మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ సర్వే నిర్వహించారు. ఈ నెల 14 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి కూడ ఉప ఎన్నికలు కూడ జరిగే అవకాశం కూడ ఉంది.
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కూడ బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని ఈ సర్వే ఫలితాలు తెలిపాయి.
రానున్న రెండు వారాల్లో టీఆర్ఎస్ నాయకత్వం ఓటు రూపంలోకి మార్చుకొంటారోననేది ఆసక్తికరంగా మారింది.
పోలింగ్ కు రెండు వారాల ముందు రాజకీయ వాతావరణాన్ని మార్చేందుకు అవకాశం ఉంది. ఈ దశలో పార్టీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని టీఆర్ఎస్ నాయకత్వం ఆయా జిల్లాల నేతలకు సూచించింది.
చాలా కాలం నుండే కేసీఆర్ ఎన్నికల పర్యవేక్షణకు దూరంగా ఉంటున్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలను మినహాయిస్తే మిగిలిన అన్ని ఎన్నికలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
2014 నుండి 2020 మధ్య జరిగిన ఎన్నికలను కేటీఆర్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు.ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల నేతలకు ఆయన స్వయంగా దిశా నిర్ధేశం చేస్తున్నారు.సీఎం కేసీఆర్ నేరుగా ఎన్నికల ప్రచారం చేయడం ఎన్నికలకు టీఆర్ఎస్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలుపుతోంది.
ప్రతి రోజూ ప్రగతి భవన్ నుండి సీఎం కేసీఆర్ కనీసం ఆరు నుండి 8 గంటల పాటు పార్టీకి చెందిన నేతలు, మంత్రులతో పాటు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశా నిర్ధేశం చేస్తున్నారు కేసీఆర్.
తాను నిర్వహించిన సర్వే ఫలితాలను నాయకులకు వివరిస్తూ ఏ రకంగా ప్రచారం నిర్వహించాలనే దానిపై నేతలకు సూచనలు చేస్తున్నారు.
రానున్న 13 రోజుల పాటు కష్టపడి పనిచేయాలని సీఎం పార్టీ నేతలను కోరారు.