Today Holiday : తెలంగాణలో నేడు కాలేజీలకు సెలవు... ఇకపై ప్రతినెలా ఈ రోజు హాలిడేనే
Telangana Holidays : తెలంగాణలో కొన్ని కాలేజీలకు ఇవాళ సెలవు ఇచ్చారు. ఇలా ప్రతి నెలా నాలుగో శనివారం ఆ కాలేజీలకు సెలవు ఉంటుంది. ఇంతకూ ఆ కాలేజీలేవో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
JNTU holiday
College Holiday : తెలంగాణలో ఇంజనీరింగ్ చేసే విద్యార్థులకు జవహార్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ (JNTU) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఈ యూనివర్సిటీ పరిధిలోకి కాలేజీలకు కేవలం ఆదివారం మాత్రమే సెలవు ఉండేది... కానీ ఇకపై నెలలోని నాలుగో శనివారం కూడా సెలవు ఇవ్వాలని నిర్ణయించారు.
జేఎన్టీయూ రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వరరావు నాలుగో శనివారం హాలిడే కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసారు. జేఎన్టీయూ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంతో పాటు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపారు. వైస్ చాన్సలర్ ఆదేశాల మేరకు నాలుగో శనివారం సెలవుపై ప్రకటన చేస్తున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు.
కేవలం జేఎన్టీయూలో చదివే విద్యార్థులకే కాదు బోధనా,బోధనేతర సిబ్బందికి కూడా ఈ సెలవు వర్తిస్తుంది. ఈ నిర్ణయం ఫిబ్రవరిలోని నాలుగో శనివారం అంటే రేపు 22 నుండే అమలులోకి రానుంది. ఇలా నెలలో ఓ రోజు సెలవు అదనంగా వస్తుండటంతో జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
JNTU
జేఎన్టీయూలో నాలుగో శనివారం సెలవు ఇప్పుడే కొత్తకాదు :
జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నాలుగో శనివారం సెలవు ఇప్పుడే కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో 2008 కి ముందు ఇలాగే జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలకు నాలుగో శనివారం సెలవు ఉండేది.వివిధ కారణాలతో ఈ సెలవును రద్దుచేసారు.
అయితే మళ్ళీ పదిహేడేళ్ల తర్వాత ఈ నాలుగో శనివారం సెలవును పునరుద్దరించారు. దీంతో వరుసగా రెండురోజులు సెలవు వస్తుండటంతో విద్యార్థులతో పాటు యూనివర్సిటీ స్టాప్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతినెల చివర్లో ఇలాగే శని, ఆదివారాలు జేఎన్టీయూ కాలేజీలకు సెలవు ఉంటుంది.
Holidays
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రెండురోజులు సెలవు :
ప్రస్తుతం నాలుగో శనివారం, ఆదివారం రెండ్రోజులు జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలకు సెలవులు వస్తున్నాయి. మళ్లీ రెండ్రోజులు కాలేజీలు నడుస్తాయో లేదో ఫిబ్రవరి 26న శివరాత్రి పండగ సెలవు వస్తుంది. కేవలం జేఎన్టీయూ కాలేజీలకే కాదు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్ధలు, కార్యాలయాలకు సెలవు ఉంటుంది.
ఇక ఫిబ్రవరి 27న తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణలో ఉమ్మడి మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్ నియోజకవర్గంలో టీచర్ ఎమ్మెల్సీతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో ఫిబ్రవరి 27 అంటే శివరాత్రి తర్వాతిరోజు పోలింగ్ జరగనుంది. కాబట్టి ఆయా జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలతో పాటే జేఎన్టీయూ కాలేజీలకు సెలవు ఉండే అవకాశాలున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాగే ఉమ్మడి తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది.