ఇప్పటికే ఆర్టీసి సమ్మె: కేసీఆర్ కు మరో ఆందోళన పోటు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇప్పటికే ఆర్టీసి సమ్మెను ఎదుర్కుంటున్నారు. ఆయనకు మరో సమ్మె ముప్పు కూడా పొంచి ఉంది. తమ పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టీఈటీయుఎఫ్) ఆందోళనకు సిద్ధమవుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇప్పటికే ఆర్టీసి సమ్మెను ఎదుర్కుంటున్నారు. ఆయనకు మరో సమ్మె ముప్పు కూడా పొంచి ఉంది. తమ పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టీఈటీయుఎఫ్) ఆందోళనకు సిద్ధమవుతోంది.
టీఈటియూఎఫ్ ఆధ్వర్వంలో అక్టోబర్ 11వ తేదీన వరంగల్ డిస్కమ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరగనుంది. హైదరాబాదులోని సదరన్ డిస్కమ్మ కార్యాలయం ముందు అక్టోబర్ 16వ తేదీన నిరసన కార్యక్రమం జరగనుంది. అక్టోబర్ 16వ తేదీ ధర్నా కార్యక్రమంలో 21 ట్రేడ్ యూనియన్లు పాల్గొంటున్నాయి.
విద్యుచ్ఛక్తి కార్మికులు ఆందోళనకు దిగితే తెలంగాణ విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. తమ సమస్యలను పరిష్కరించడానికి యాజమాన్యం ఏ మాత్రం ముందుకు రావడం లేదని, కొత్త ఉద్యోగులను తీసుకుంటామని హామీ ఇచ్చారని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారని టీఈటియుఎఫ్ చైర్మన్ ఎన్. పద్మారెడ్డి డక్కన్ క్రానికల్ తో అన్నారు.
కాంట్రాక్టు కార్మికులందరినీ క్రమబద్దీకరించాలని, ఖాళీలను భర్తీ చేయాలని, నేషనల్ ఇంక్రిమెంట్ వంటి వాటితో పోలిస్తే ఉన్న వ్యత్యాసాలను తగ్గించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటీకరణను కార్మికులు వ్యతిరేకిస్తున్నారు
తమ డిమాండ్లను పరిష్కరించకపోతే అక్టోబర్ 23వ తేదీన హైదరాబాదులో మహా ధర్నా నిర్వహించాలని కూడా ఆలోచన చేస్తున్నారు. తమ ఆందోళనకు అవసరమైతే రాజకీయ పార్టీల మద్తు తీసుకుంటామని చెప్పారు.