- Home
- Telangana
- Weather: వారం రోజులు వానలే వానలు.. క్యుములోనింబస్ మేఘాలతో జాగ్రత్త అంటోన్న అధికారులు
Weather: వారం రోజులు వానలే వానలు.. క్యుములోనింబస్ మేఘాలతో జాగ్రత్త అంటోన్న అధికారులు
మే నెల ప్రారంభమైంది. సహజంగానే ఈ నెలలో ఎండలు దంచికొడుతాయి. అయితే ఈసారి మేల నెల ప్రారంభంలో ప్రజలకు వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే వారం రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఏయే ప్రాంతాల్లో వర్షం కురవనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
భారత వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం, దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో వాయు గుండాల ప్రభావం, ఉపరితల ఆవర్తనాల కారణంగా వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో వచ్చే ఏడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఏడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, యానాం, మహారాష్ట్ర కొంత భాగంలో వర్షాలు పడే అవకాశం ఉంది.
भीषण गर्मी के बाद दिल्लीवासियों को राहत
క్యుములోనింబస్ మేఘాలు:
క్యుములోనింబస్ మేఘాలు చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతుంటారు. ఈ మేఘాల స్వభావం విభిన్నంగా ఉంటుంది. ఇవి భారీగా తేమను మోస్తూ, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉంది. గంటకు 30–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలో వర్ష సూచన:
శనివారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, నల్గొండ, కేసముద్రం ప్రాంతాల్లో ఉదయం 8 వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. సాయంత్రం 5 తర్వాత హైదరాబాద్లో మోస్తరు వర్షాలు పడొచ్చు, రాత్రి 7 వరకు కొనసాగే అవకాశం ఉంది. రామగుండం, జగిత్యాల, జమ్మికుంట, బెల్లంపల్లి ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చు.
delhi rain
ఆంధ్రప్రదేశ్లో వాతావరణ ఎలా ఉండనుందంటే.?
కోస్తా జిల్లాల్లో ఉదయం 7 గంటల తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, పాలకొల్లు, పిడుగురాళ్ల వంటి ప్రాంతాల్లో ఉదయం 9 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మచిలీపట్నం, వినుకొండ, చీరాల, ఒంగోలు, మార్కాపురం ప్రాంతాల్లో వర్షాల కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇక మధ్యాహ్నం 2 తర్వాత రాయలసీమలో తిరుపతి, కడప, పులివెందుల ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే దక్షిణ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సాయంత్రం 3 తర్వాత మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో 34–37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో అత్యధికంగా 40 డిగ్రీల వరకూ చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఏపీలో 62 శాతం. తెలంగాణలో 31 శాతం తేమ ఉండే అవకాశం ఉంది.
భారీ ఈదుగు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వడగండ్ల వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు అధికారులు.