- Home
- Telangana
- Rains : ఈ రెండ్రోజులు వానలే వానలు... ఈ తెలంగాణ జిల్లాల్లో వడగళ్ల వర్షసూచన, తస్మాత్ జాగ్రత్త
Rains : ఈ రెండ్రోజులు వానలే వానలు... ఈ తెలంగాణ జిల్లాల్లో వడగళ్ల వర్షసూచన, తస్మాత్ జాగ్రత్త
మండు వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి... మరో రెండుమూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rains in Telugu States
Weather : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండుటెండలతో ఇబ్బందిపడుతున్న తెలుగు ప్రజలకు నిన్నటినుండి ఉపశమనం లభించింది. ఇరు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి... ఈ వర్షాలు మరో మూడ్రోజులు (మార్చి 22,23,24) కొనసాగనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అంటే ఈ వీకెండ్ చల్లచల్లగా గడిచిపోతుందన్నమాట.
శుక్రవారం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. ఇక రాజధాని హైదరాబాద్ లో గత అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అర్ధరాత్రి వరకు కొనసాగింది. దీంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి... అయితే అర్థరాత్రి కావడంతో ట్రాఫిక్ సమస్యలేమీ తలెత్తలేదు. తెల్లవారుజాముకు రోడ్లపై నిలిచిన వర్షపునీరంతా డ్రైనేజీ కాలువల్లోకి చేరింది. కాబట్టి నగరవాసులకు వర్షం వల్ల ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు.
కానీ తెలంగాణ పల్లెల్లో మాత్రం ఈ అకాల వర్షాలు రైతన్నలకు నష్టం మిగిల్చాయి. ముఖ్యంగా ఈదురుగాలుల కారణంగా మామిడి కాయలు రాలి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఇక మరికొన్ని పంటలు కూడా ఈ వర్షాలకు దెబ్బతిన్నారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
Telangana Rains
మరో రెండ్రోజులు ఈ తెలంగాణ జిల్లాలకు వర్షసూచన :
తెలంగాణలో శుక్రవారం మొదలైన వర్షాలు మరో రెండ్రోజులు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. వేసవి కాలంలో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇవాళ, రేపు (మార్చి 22, మార్చి 23న) 40-50 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు, వడగళ్ల వానలు కురిస్తాయని హెచ్చరించారు. ఇలా మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.
ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటల 30-40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షం కురుస్తుందని హెచ్చించారు. రాజధాని హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇక మార్చి 24 సోమవారం కూడా తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయని ప్రకటించారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలనల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకటించింది.
Telangana Rains
తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 5 జిల్లాలు, ప్రాంతాలివే :
నిన్న(శుక్రవారం) నుండి తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. రాత్రికి ఇవి ఊపందుకుని హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో దంచికొట్టాయి. ఇలా నిన్నటి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 5 జిల్లాలు, ప్రాంతాలేమిటో చూద్దాం.
ప్రాంతాలవారిగా అత్యధిక వర్షపాతం ;
1. మెదక్ (బసంత్ పూర్) -59.5 మిల్లీమీటర్లు
2. జగిత్యాల (పెగడపల్లె) - 57 మిల్లిమీటర్లు
3. కరీంనగర్ (గంగధర) - 57 మిల్లీమీటర్లు
4. రాజన్న సిరిసిల్ల (చందుర్తి) -54.2 మిల్లీమీటర్లు
5. పెద్దపల్లి (ధర్మారం) - 51.2 మిల్లిమీటర్లు
జిల్లాలవారిగా అత్యధిక వర్షపాతం :
1. జగిత్యాల - 17.6 మిల్లిమీటర్లు
2. పెద్దపల్లి - 17.2 మిల్లీమీటర్లు
3. కరీంనగర్ - 16.4 మిల్లీమీటర్లు
4. మెదక్ - 15.6 మిల్లీమీటర్లు
5. హైదరాబాద్ - 15.3 మిల్లిమీటర్లు
Andhra Pradesh Rains
ఆంధ్ర ప్రదేశ్ లోని ఈ ప్రాంతాలకు వర్షసూచన :
తెలంగాలో మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. ఇక్కడ కూడా పలు ప్రాంతాల్లో నిన్నటి నుండి వర్షాలు మొదలయ్యాయి. ఈ వర్షాలు మరో నాలుగురోజులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వర్షాల వల్ల ఈ మండువేసవిలో వాతావరణం చల్లబడింది.
ఉత్తర కోస్తాతో పాటు రాయలసీమలోని కొన్నిప్రాంతాల్లో ఉరుములు మెరుపులు. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. మిగతాప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం కావడంవల్ల ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. అకాల వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.