MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Gali Janardhan reddy: బంగారం తుప్పు పడుతుందా.? హైకోర్ట్‌లో గాలి జనార్ధన్‌ రెడ్డి పిటిషన్‌

Gali Janardhan reddy: బంగారం తుప్పు పడుతుందా.? హైకోర్ట్‌లో గాలి జనార్ధన్‌ రెడ్డి పిటిషన్‌

మైనింగ్‌ కింగ్‌గా పేరు గాంచిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇంతకీ ఏంటా పిటిషన్‌, హైకోర్టు ఏమని తీర్పునిచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Narender Vaitla
Published : Mar 14 2025, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Gali Janardhan Reddy

Gali Janardhan Reddy

ఓబులాపురం మైనింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన రెడ్డితో పాటు ఆయన కుమారుడు కిరీట్‌ రెడ్డి, కూతురు బ్రాహ్మణి దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పు పట్టిపోతాయంటూ గాలి జనార్ధన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్‌ చేసిన నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన కుమార్తె జి.బ్రాహ్మణి, కుమారుడు జి.కిరీటిరెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు 

24
Gali Janardhan Reddy

Gali Janardhan Reddy

అయితే ఈ పిటిషన్‌ను హైకోర్ట్‌ కొట్టేసింది. బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని, విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కేసు విచారణ పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది. నేరపూరిత సొమ్ముతో కొనుగోలు చేసిన నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోదని, అందుకే ఈ దశలో సీజన్‌ చేసిన నగలను అప్పగించలేమని తేల్చి చెప్పింది. కేసు విచారణ పూర్తయ్యాకే నగలను తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 

34
Gali Janardhan Reddy

Gali Janardhan Reddy

అసలేంటీ కేసు.? 

గనుల అక్రమ తవ్వకాల ద్వారా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో గాలి జనార్దన్‌రెడ్డితోపాటు మరో 9 మందిపై సీబీఐ 2009లో సీబీఐ కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబరు 5న జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం జిల్లాలకు వెళ్లవద్దనే షరతులతో సుప్రీంకోర్టు 2015 జనవరి 20న ఆయనకు బెయిలు మంజూరు చేసింది. 
 

44
gali janardhan reddy

gali janardhan reddy

ఓఎమ్‌సీ కేసు ఏళ్ల తరబడి కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలసుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్ ద్వారా రూ.884.13 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదుచేసింది. 2011 సెప్టెంబర్ 5న ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయగా.. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో 53 కిలోలున్న సుమారు 105 బంగారు ఆభరణాలు, నగదు, బాండ్లను సీబీఐ సీజ్ చేసింది. బాండ్లను విడుదల చేయొద్దంటూ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ కు లేఖ రాసింది.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved